ప్రణయ్ శుభారంభం
మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు హెచ్.ఎస్.ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-14, 17-21, 21-18తో డారెన్ ల్యూ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు.
సాత్విక్ జోడీ ముందంజ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు హెచ్.ఎస్.ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-14, 17-21, 21-18తో డారెన్ ల్యూ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. 62 నిమిషాల పోరులో డారెన్ను చిత్తుచేసిన ప్రణయ్.. అతనిపై తన గెలుపోటముల రికార్డును 7-4తో మరింత మెరుగు పరుచుకున్నాడు. సాయి ప్రణీత్ 15-21, 21-19, 9-21తో ఆంథోనీ జింటింగ్ (ఇండోనేసియా) చేతిలో, సమీర్వర్మ 14-21, 21-13, 7-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడారు. పురుషుల డబుల్స్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెట్టి ముందంజ వేసింది. తొలి రౌండ్లో సాత్విక్- చిరాగ్ జోడీ 21-18, 21-11తో వీ చాంగ్- వున్ తీ (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప 15- 21, 11-21తో మత్సుయామా- చిహరు చేతిలో, హరిత- ఆష్నా 7-21, 12-21తో జియాంగ్ యున్- కిమ్ జియాంగ్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో వెంకట గౌరవ్ ప్రసాద్- జుహి 15-21, 9-21తో కిమ్ వాన్- జియాంగ్ యున్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత