శ్రీశంకర్‌కు ఆరో స్థానం

కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించిన భారత లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ మొనాకో డైమండ్‌ లీగ్‌లో నిరాశపరిచాడు. చివరిదైన అయిదో ప్రయత్నంలో 7.94 మీటర్లు దూకి ఆరో స్థానంతో సంతృప్తి

Published : 12 Aug 2022 03:41 IST

మొనాకో: కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించిన భారత లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ మొనాకో డైమండ్‌ లీగ్‌లో నిరాశపరిచాడు. చివరిదైన అయిదో ప్రయత్నంలో 7.94 మీటర్లు దూకి ఆరో స్థానంతో సంతృప్తి చెందాడు. కొత్త నిబంధనల ప్రకారం మొదటి అయిదు ప్రయత్నాల్లో టాప్‌-3లో నిలిచిన వారికే ఆరోసారి దూకే అవకాశం లభిస్తుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మైకెల్‌ మాసో (క్యూబా) 8.35మీ దూకి స్వర్ణం గెలుచుకున్నాడు. గ్రీస్‌కు చెందిన టెంటోగ్లౌ (8.31మీ) రజతం నెగ్గగా.. డెండి (8.31మీ, అమెరికా) కాంస్యం సాధించాడు. శ్రీశంకర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 8.08మీ దూరంతో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని