తెలుగు యోధాస్‌ జోరు

అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో తెలుగు యోధాస్‌ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం స్థానిక శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 68-47 తేడాతో రాజస్థాన్‌ వారియర్స్‌ను ఓడించింది.

Published : 17 Aug 2022 03:13 IST

పుణె: అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌ ఆరంభ సీజన్‌లో తెలుగు యోధాస్‌ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం స్థానిక శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 68-47 తేడాతో రాజస్థాన్‌ వారియర్స్‌ను ఓడించింది. ఆదర్శ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట డిఫెన్స్‌లో మూడు నిమిషాల 43 సెకన్ల పాటు ప్రత్యర్థికి దొరకకుండా తప్పించుకున్న అతను.. అనంతరం ఎటాకింగ్‌లో 10 పాయింట్లు సాధించాడు. ప్రసాద్‌ (13), రోహన్‌ (10) కూడా ఎటాకింగ్‌లో రాణించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 54-49తో ఒడిషా జగర్‌నట్స్‌పై విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని