ఫైనల్లో ఉన్నతి
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల అండర్-17 విభాగంలో ఉన్నతి హుడా ఫైనల్కు దూసుకెళ్లింది.
దిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల అండర్-17 విభాగంలో ఉన్నతి హుడా ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో ఆమె 21-8, 21-17తో యొకోచి (జపాన్)పై నెగ్గి ఆదివారం సరున్రాక్ (థాయ్లాండ్)తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ విభాగం సింగిల్స్లో ఫైనల్ చేరిన భారత తొలి మహిళా షట్లర్ ఉన్నతినే. అండర్-17 విభాగంలో పురుషుల డబుల్స్లో ఇంతకుముందు అర్జున్-చిరాగ్ శెట్టి (2013), కృష్ణ ప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. అండర్-15 సింగిల్స్లో అనీష్ తుదిపోరులో అడుగుపెట్టాడు. సెమీస్లో అతడు 18-21, 21-12, 21-12తో లీయూ-జుయ్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. జ్ఞాన దత్తు 16-21, 21-19, 13-21తో లీయూ చేతిలో ఓడిపోయాడు. అండర్-17 బాలుర డబుల్స్ సెమీస్లో అర్ష్-సంస్కార్ 21-15, 21-19తో చిరుయ్-సివో హువా (చైనీస్ తైపీ)పై నెగ్గగా.. అండర్-15 బాలుర డబుల్స్ సెమీస్లో ఓడిన జైసన్-అతీష్ కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత