World Cup: వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రధాన ఆయుధం అతడే: వసీమ్ అక్రమ్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్బౌలర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya)పై ప్రశంసలు కురిపించాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రధాన ఆయుధం అతడేనన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఆసియా కప్లో టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అదరగొట్టాడు. బంతితో, బ్యాటుతో రాణించి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో (రద్దయిన మ్యాచ్) టాప్ ఆర్డర్ విఫలమైన వేళ ఇషాన్ కిషన్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో 90 బంతుల్లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్బౌలర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రధాన ఆయుధం అతడేనన్నాడు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు.‘‘రాబోయే ప్రపంచ కప్లో హార్దిక్ పాండ్య టీమ్ఇండియా ప్రధాన ఆయుధం. ఈ టోర్నీ టైటిల్ ఫేవరెట్లలో టీమ్ఇండియా ఒకటి. వారి స్వదేశంలో టోర్నీ జరగనుంది. ఆసియా కప్ ఫైనల్లో భారత్ బౌలింగ్ సత్తా ఏంటో చూశాం. ఆసియా కప్లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పెద్ద జట్లపై కూడా వికెట్లు పడగొట్టాడు’’ అని వసీమ్ అక్రమ్ వివరించాడు.
‘రోహిత్కు అసలు సిసలు పరీక్ష ముందుంది.. ఏ మాత్రం తేడా వచ్చినా’
బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు లేదు: ఆకాశ్ చోప్రా
టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెన్నుగాయం కారణంగా సూమారు 11 నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్తో పునరాగమనం చేసిన అతడు అదిరిపోయే బౌలింగ్తో మునుపటి బుమ్రాను గుర్తు చేసున్నాడు. ఆసియా కప్లోనూ సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, అతడు గాయం నుంచి కోలుకుని వచ్చినట్లు కనిపించడం లేదన్నాడు. ‘‘బుమ్రా 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడా అని మేం ఆలోచించాం. అతనికి ఎక్కువసార్లు 10 ఓవర్లు వేయాల్సిన అవసరం రాలేదు. కానీ, వేసిన ఓవర్లలో మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాకైతే బుమ్రా గాయం నుంచి కోలుకుని వచ్చిన బౌలర్లా కనిపించడం లేదు. బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తున్నాడు. మంచి పేస్, రిథమ్తో వైవిధ్యంగా బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా రాకతో జట్టు బలంగా మారింది’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.