Rohit Sharma: ‘రోహిత్కు అసలు సిసలు పరీక్ష ముందుంది.. ఏ మాత్రం తేడా వచ్చినా’
రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నాడు. అయితే, వన్డే ప్రపంచకప్ (World Cup 2023) రూపంలో అతడికి మరో 15 రోజుల్లో అసలు సిసలు పరీక్ష మొదలుకానుందని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఆసియా కప్ (Asia Cup 2023). ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ను దక్కించుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో భారత్కి రెండో ఆసియా కప్. 2018లోనూ అతడి సారథ్యంలో టీమ్ఇండియా (Team India) టైటిల్ సాధించింది. దీంతో కెప్టెన్గా ఉన్న రెండుసార్లు జట్టును ఛాంపియన్గా నిలిపి ఆసియా కప్ సక్సెస్ ఫుల్ కెప్టన్లలో ఒకడిగా అవతరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నాడు. అయితే, వన్డే ప్రపంచకప్ రూపంలో అతడికి మరో 15 రోజుల్లో అసలు సిసలు పరీక్ష మొదలుకానుందని పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్లో జట్టు ప్రదర్శనలో ఏ మాత్రం తేడా వచ్చినా అతడు విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. గతంలో విరాట్ కోహ్లీ, 2007లో రాహుల్ ద్రవిడ్కు ఇలాంటి అనుభవం ఎదురైందని గుర్తు చేశాడు. కానీ, ప్రస్తుతం ఉన్న భారత జట్టుకు ప్రపంచకప్ ఫైనల్కు చేరే సత్తా ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
సిరాజ్ మియా.. నీ మాయ అదిరిందయ్యా..!
‘‘రోహిత్ కెప్టెన్సీ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతడు సారథిగా అయిదు ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు. చాలామంది ఒక్కసారి కూడా జట్టును జట్టును ఛాంపియన్గా నిలపలేకపోయారు. కానీ, రోహిత్కు అసలు సిసలు పరీక్ష మరో 15 రోజుల్లో మొదలుకానుంది. ప్రస్తుతం జట్టులో 15-18 మంది అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లున్నారు. ఒకవేళ వారు సరైన సమయంలో మంచి ప్రదర్శన చేయకపోతే అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు మొదలవుతాయి. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రతి కెప్టెన్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో విరాట్ కోహ్లీకి, 2007లో రాహుల్ ద్రవిడ్కి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఒకవేళ ఈ సారి టీమ్ఇండియా ప్రపంచకప్ సాధించడంలో విఫలమైతే రోహిత్ కూడా ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న జట్టుకు ప్రపంచకప్ ఫైనల్ చేరే సత్తా ఉంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
ఆసియా కప్ను దక్కించుకుని ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా సెప్టెంబరు 22 నుంచి ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. అనంతరం ప్రపంచకప్ మొదలవుతుంది. ఆసీస్తో వన్డే సిరీస్ కోసం ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టునే ఈ సిరీస్కు కొనసాగించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?