IPL Auction: ‘షాక్కు గురయ్యా.. తీవ్ర నిరాశ చెందా’ : ఐపీఎల్ వేలంపై పేసర్ ఆవేదన
ఇప్పటి వరకు 104 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 114 వికెట్లు పడగొట్టిన పేసర్ సందీప్ శర్మను ఇటీవల జరిగిన వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. దీనిపై అతడు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్ మినీ వేలం(IPL 2023 auction).. కొందరు యువ ఆటగాళ్లను రాత్రికి రాత్రే మిలియనీర్లుగా మార్చింది. అయితే, అదే సమయంలో పలువురు వెటరన్ ఆటగాళ్లను ఒక్క ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయకుండా నిరాశ పర్చింది. ఈ జాబితాలో భారత పేసర్ సందీప్ శర్మ(Sandeep Sharma) కూడా ఉన్నాడు. కొచ్చిలో జరిగిన వేలంలో తనను ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంపై అతడు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.
‘నేను షాక్కు గురయ్యాను. తీవ్ర నిరాశ చెందాను. నన్నెందుకు కొనలేదో నాకే తెలియదు. ఏ జట్టుకు ఆడినా మంచి ప్రదర్శనే ఇచ్చాను. నన్ను ఏదో ఒక జట్టు కొనుగోలు చేస్తుందని అనుకున్నాను. ఇలా జరగడం ఊహించలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. దేశవాళీ క్రికెట్లో రాణించాను. రంజీ ట్రోఫీ చివరి రౌండ్లో ఏడు వికెట్లు తీశాను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రాణించా’ అని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పవర్ప్లేలో స్థిరమైన వికెట్ టేకర్గా పేరున్న సందీప్.. ఇప్పటి వరకు 104 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 114 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున రెండు టీ20 మ్యాచ్లు ఆడి ఒక వికెట్ తీశాడు. ‘బౌలింగ్లో నిలకడగా వికెట్లు తీయడానికి నేను ప్రయత్నిస్తాను. అదొక్కటే నా చేతుల్లో ఉంది. జట్లు నన్ను ఎంచుకోవడం, ఎంచుకోకపోవడం నా చేతుల్లో లేదుగా’ అని నిరాశ వ్యక్తం చేశాడు. ఈ వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైస్తో ఉన్న ఇతడిని ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు