IPL 2022 : ఆ జట్టు.. లఖ్నవూ సూపర్ జెయింట్స్
ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లఖ్నవూ ఫ్రాంఛైజీ తమ జట్టు పేరును సోమవారం ప్రకటించింది. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానుల సూచించిన పేర్ల నుంచి లఖ్నవూ సూపర్ జెయింట్స్ను
లఖ్నవూ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లఖ్నవూ ఫ్రాంఛైజీ తమ జట్టు పేరును సోమవారం ప్రకటించింది. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానుల సూచించిన పేర్ల నుంచి లఖ్నవూ సూపర్ జెయింట్స్ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. గతేడాది బిడ్డింగ్లో లఖ్నవూ ఫ్రాంఛైజీని రూ.7,090 కోట్లకు ఆర్ఎస్పీజీ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు పేరు పెట్టాలని ఆ సంస్థ అభిమానులకు పిలుపునిచ్చింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘‘జట్టుకు పేరు సూచించే పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. అందుకు అందరికీ ధన్యవాదాలు. లక్షలాది ప్రజలు వివిధ పేర్లు పంపించారు. వాటి ప్రకారం లఖ్నవూ ఐపీఎల్ జట్టుకు లఖ్నవూ సూపర్ జెయింట్స్ అని పేరు పెట్టాం’’ అని ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వీడియో సందేశంలో తెలిపాడు. ఈ ఏడాది నుంచి ఐపీఎల్లో లఖ్నవూతో పాటు అహ్మదాబాద్ జట్టు కూడా కొత్తగా చేరనున్న సంగతి తెలిసిందే. లఖ్నవూకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్కు హార్దిక్ పాండ్య కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!