BCCI: పుజారా, రహానె గ్రేడ్లు డౌన్.. పాండ్య ఏకంగా ‘సి’లోకి!
భారత ఆటగాళ్ల వార్షిక ఒప్పంద వివరాలను బీసీసీఐ వెల్లడించింది. బుధవారం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆటగాళ్ల గ్రేడ్లను నిర్ణయించింది. టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్..
ఇంటర్నెట్ డెస్క్: భారత ఆటగాళ్ల వార్షిక ఒప్పంద వివరాలను బీసీసీఐ వెల్లడించింది. బుధవారం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆటగాళ్ల గ్రేడ్లను నిర్ణయించింది. టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా, టెస్టు ఫార్మాట్ మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానె ‘బి’ గ్రేడ్లోకి పడిపోయారు. గతేడాది వరకు వీరిద్దరూ ‘ఎ’ గ్రేడ్ ఆటగాళ్ల కేటగిరీలో ఉన్నారు. పుజారా, రహానె ఇద్దరూ గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. దీంతో మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్కు వీరిద్దరినీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
వెన్నెముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఏకంగా ‘ఎ’ గ్రేడ్ నుంచి ‘సి’ గ్రేడ్కి పడిపోయాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం ‘సి’ గ్రేడ్లో ఉన్నాడు. ఇటీవల వార్తల్లో నిలిచిన సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్ ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్లోకి వెళ్లిపోయారు. ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను బీసీసీఐ నాలుగు కేటగిరీలుగా విభజిస్తుంది. వీరిలో ‘ఎ+’ ఆటగాళ్లకు సంవత్సానికి రూ.7 కోట్లు, ఎ, బి, సి కేటగిరీ ఆటగాళ్లకు వరుసగా రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, కోటి రూపాయలను బీసీసీఐ చెల్లిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా ప్రస్తుతం ఎ+ గ్రేడ్లో కొనసాగుతుండగా.. అశ్విన్, జడేజా, పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ ‘ఎ’గ్రేడ్లో ఉన్నారు. గతంలో ‘ఎ’ గ్రేడ్లో 10 మంది ఆటగాళ్లకు చోటుండగా.. ఆ సంఖ్య ఇప్పుడు ఐదుకే పరిమితం చేశారు. మొత్తం 27 మందితో బీసీసీఐ వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది 28 మందికి అవకాశం ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..