Ashwin: జయ్దేవ్పై విమర్శలు సరికాదు.. అతడి దేశీయ గణాంకాలు చూడాలి: అశ్విన్
బంగ్లాదేశ్పై టెస్టు సిరీస్ను గెలవడంలో రవిచంద్రన్ అశ్విన్ (ashwin) కీలక పాత్ర పోషించాడు. అలాగే దాదాపు 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన జయ్దేవ్ను (jaydev unadkat) అశ్విన్ అభినందించాడు. ఈ మ్యాచ్లో జయ్దేవ్ మూడు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు కెరీర్ను ఆరంభించిన దాదాపు 12 ఏళ్ల తర్వాత రెండో మ్యాచ్ ఆడిన టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ జయ్దేవ్ను తీసుకోవడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. బంగ్లాదేశ్పై రెండో టెస్టులో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జయ్దేవ్ను ఎంపిక చేయడంపై వచ్చిన విమర్శలను భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కొట్టిపడేశాడు. దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. సౌరాష్ట్ర క్రికెట్కు టార్చ్బేరర్గా నిలిచాడని అభినందించాడు.
‘‘బంగ్లాపై టెస్టు సిరీస్ గెలిచాక అందించిన ట్రోఫీని జయ్దేవ్ను పైకెత్తి పట్టుకోవాలని చెప్పా. ఎందుకంటే అతడు ఇప్పటికే రంజీ ట్రోఫీని తన జట్టుకు అందించాడు. సౌరాష్ట్ర క్రికెట్కు చేసిన సేవలకుగాను టెస్టు సిరీస్ను అందుకొనే అర్హత జయ్దేవ్కు ఉంది. ఎంతో అనుభవంతో బౌలింగ్ చేసే ఉనద్కత్ జట్టులో ఉండటం సానుకూలాంశం. ఒక్కసారి దేశీయ క్రికెట్లో అతడి బౌలింగ్ గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. సౌరాష్ట్ర క్రికెట్కు మార్గనిర్దేశకుడు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర ఒక శక్తి మారడంలో జయ్దేవ్ కీలక పాత్ర పోషించాడు. బంగ్లాతో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నాటౌట్గా నిలిచిన జయ్దేవ్.. రెండో ఇన్నింగ్స్లోనూ విజయానికి అవసరమైన పరుగులు చేయగల సత్తా అతడిలో ఉంది’’ అని తెలిపాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 97 మ్యాచుల్లో 356 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 116 మ్యాచుల్లో 168 వికెట్లు పడగొట్టాడు.
‘‘భారత్లో అత్యంత హాట్ టాపిక్ ఐపీఎల్. దేశీయ క్రికెటర్లతోపాటు అంతర్జాతీయ ఆటగాళ్ల వరకు ఐపీఎల్ చాలామంది జీవితాలను మార్చేసింది. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం దొరికింది. అయితే, భారత్ తరపున ఆడిన వారిలో 70 నుంచి 80 శాతం మంది రంజీ ట్రోఫీలో అదరగొట్టి వచ్చినవారే. ఉనద్కత్, సౌరభ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, షహ్బాజ్ నదీమ్, అభిమన్యు ఈశ్వరన్... ఇలా వీరంతా రంజీ, దులీప్ ట్రోఫీ, ఇండియా - ఏ రాణించారు. అయితే ఏదొక సమయంలో విఫలమైనప్పుడు విమర్శలు చేయడం సర్వసాధారణం. ఐపీఎల్లో రాణిస్తే వెంటనే గుర్తిస్తున్నాం. అయితే, ఇతర టోర్నీల్లో బాగా ఆడిన క్రికెటర్లను గుర్తించడంలో మాత్రం విఫలమవుతున్నాం’’ అని అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.