Ravi shastri: నా బిందాస్ బ్యాచే నం.1
టీమ్ఇండియా కుర్రాళ్లపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదల...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కుర్రాళ్లపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదల ప్రదర్శించారని తెలిపాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో తన కుర్రాళ్లు అద్భుతంగా రాణించారని పొగిడాడు.
ఐసీసీ విడుదల చేసిన వార్షిక ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా నంబర్వన్గా నిలిచింది. 121 రేటింగ్ సాధించింది. ఒక పాయింట్ అంతరంతో న్యూజిలాండ్ను రెండో స్థానంలోకి నెట్టేసింది. ఈ రెండు జట్లు త్వరలోనే ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తర్వాతి ర్యాంకింగ్స్ అందుకోవడం గమనార్హం. కరోనా వైరస్ భయం, కఠిన క్వారంటైన్లు అనుభవిస్తూనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ను టీమ్ఇండియా ఓడించింది.
‘నంబర్ వన్ కిరీటం దక్కించుకొనేందుకు ఈ భారత జట్టు అకుంఠిత దీక్ష, అంకితభావం, మొక్కవోని పట్టుదల, ఏకాగ్రతను ప్రదర్శించింది. కుర్రాళ్లు నిజాయితీగా ఆడి, కష్టపడి దీనిని సాధించారు. మధ్యలోనే నిబంధనలు మార్చేశారు. కానీ టీమ్ఇండియా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి అడ్డంకినీ దాటేసింది. కఠిన పరిస్థితుల్లో నా కుర్రాళ్లు కఠిన క్రికెట్ ఆడారు. ఈ బిందాస్ బృందం పట్ల అత్యంత సంతోషంగా ఉన్నా’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్