Rishabh Pant: మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన రిషభ్ పంత్.. వీడియో వైరల్

టీమ్‌ఇండియాకు గుడ్ న్యూస్‌! గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ బ్యాటర్‌, వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు.

Published : 16 Aug 2023 15:48 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియాకు గుడ్ న్యూస్‌! గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ బ్యాటర్‌, వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. పంత్‌ ఓ లోకల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి పంత్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. అతడు త్వరగా సాధారణ స్థితికి చేరుకుని ఫిట్‌నెస్ సాధించి మళ్లీ టీమ్‌ఇండియా తరఫున ఆడాలని కామెంట్లు పెడుతున్నారు. 

ఆసియా కప్‌.. తుది జట్టులో మాత్రం అతడు వద్దు: రవిశాస్త్రి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌.. కాలికి శస్త్రచికిత్స జరగడంతో దాదాపు మూడు నెలలపాటు మంచానికే పరిమితమయ్యాడు. వేగంగా కోలుకుంటున్న అతడు.. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహబిలిటేషన్‌లో ఉన్నాడు. ఎన్‌సీఏలోనే ఉన్న కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను పంత్‌ ఈ మధ్యే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పంత్ వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. త్వరగా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే అంతకంటే ముందు టీమ్‌ఇండియాలోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని