పంత్‌ చిన్నప్పటి నుంచి మార్చుకోలేదేమో!

టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన సంతకాన్ని మార్చుకోలేదని ఆటపట్టిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు...

Updated : 29 Jan 2021 13:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన సంతకాన్ని మార్చుకోలేదని ఆటపట్టిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌(274)  టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే గబ్బా టెస్టులో 89* పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో ఒక్కసారిగా హీరోగా మారిన పంత్‌ తాజాగా ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యాడు. అదేంటో మీరే తెలుసుకోండి.

గబ్బా టెస్టుతో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ కెరీర్‌లో కీలక మైలురాయి చేరుకున్నాడు. అది అతడికి వందో టెస్టు. కంగారూ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా ఆటగాళ్లు లైయన్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆటోగ్రాఫ్‌లు చేసిన ఒక జెర్సీని ఆసీస్‌ స్పిన్నర్‌కు అందజేశారు. తాజగా, ఐసీసీ ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే ఆ జెర్సీపై పంత్‌ చేసిన సంతకం చిన్నపిల్లలు చేసే విధంగా ఉందని పలువురు ట్రోలింగ్‌ చేస్తున్నారు. పంత్‌ చిన్నప్పటి నుంచి సంతకాన్ని మార్చుకోలేదని కామెంట్లు పెడుతున్నారు. అలాగే తన సంతకం చివరన స్మైలీ ఎమోజీ జతచేయడంతో నెటిజన్లు మీమ్స్‌తో నవ్వుకుంటున్నారు.

ఇవీ చదవండి..
దోషిగా తేలిన శ్రీలంక మాజీ ఆటగాడు
ఇక్కడివాడే.. కంగారూ గడ్డపై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని