IND vs SL: మా తొలి లక్ష్యమే పూర్తయింది.. ఆ నిర్ణయం వారికే వదిలేశా: రోహిత్
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) దిగ్విజయంగా సెమీస్కు దూసుకెళ్లిన తొలి జట్టుగా భారత్ (Team India) అవతరించింది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అర్హత సాధించింది. శ్రీలంకను భారీ తేడాతో ఓడించి.. రన్రేట్ను కూడా గణనీయంగా పెంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ముందే సెమీస్కు చేరడం ఆనందంగా ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. శ్రీలంకను 302 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ తమ తొలి లక్ష్యం ఇప్పుడే పూర్తయిందని.. మున్ముందు రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. అలాగే డీఆర్ఎస్ను తీసుకొనే విషయంలో వికెట్ కీపర్, బౌలర్కే నిర్ణయం వదిలేసినట్లు వెల్లడించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషిస్తున్నారని అభినందించాడు.
‘‘వరల్డ్ కప్ ప్రారంభం నుంచి మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా సెమీస్కు చేరుకోవడం ఆనందంగానూ ఉంది. మా తొలి లక్ష్యం పూర్తయింది. తొలుత సెమీస్కు చేరుకోవాలనే ధ్యేయంతో ఆడాం. ఇక ఫైనల్స్పైనే గురి పెడతాం. ఇప్పటి వరకు జరిగిన ఏడు మ్యాచుల్లో మేం ఆడిన విధానంపట్ల సంతృప్తిగా ఉన్నా. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నారు. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచడం వల్ల బౌలర్లకు మరింత స్వేచ్ఛ లభిస్తోంది. 350+ స్కోరు ఎలాంటి పిచ్పైనైనా మంచి టార్గెట్. శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే అయ్యర్ ఇలాంటి ఇన్నింగ్స్లను అలవోకగా ఆడేస్తాడు. సూర్యకుమార్ కూడా కీలకమైన పరుగులు అందించాడు.
మా బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంగ్లాండ్తో అదరగొట్టిన వారు మరోసారి శ్రీలంకపైనా అద్భుత ప్రదర్శన చేశారు. సిరాజ్ నాణ్యమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడు. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించి జట్టును గెలిపించడం బాగుంది. ఇదే ఊపును చివరి వరకూ కొనసాగిస్తారని ఆశిస్తున్నా. ఇక షమీ బౌలింగ్లో రివ్యూ విషయంలో నిర్ణయం బౌలర్, వికెట్ కీపర్కే వదిలేశా. బంతి గమనం వారిద్దరికే బాగా తెలుస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిపై నాకు నమ్మకం ఉంది. డీఆర్ఎస్లో ఇవాళ ఒక నిర్ణయం అనుకూలంగా వచ్చింది. మరొకటి చేజారింది. ఇక తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడబోతున్నాం. ఈ వరల్డ్ కప్లో సఫారీ జట్టు అద్భుతంగా ఆడుతోంది. తప్పకుండా కోల్కతా వేదికగా జరగబోయే ఆ మ్యాచ్ను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని భావిస్తున్నా’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
నాతో సహా అందరూ విఫలం: కుశాల్ మెండిస్
‘‘భారత్తో మ్యాచ్లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. నాతో సహా మిగతా వారంతా విఫలమయ్యారు. బౌలింగ్లో రాణించినప్పటికీ బ్యాటింగ్లో తేలిపోయాం. లైట్ల వెలుతురులో పిచ్ బౌలింగ్కు మరింత సహకరించింది. దానిని మేం ఊహించలేకపోయాం. అందుకే టాస్ గెలిచిన తర్వాత తొలుత బౌలింగ్ ఎంచుకున్నా. తొలి అర్ధభాగంలో వికెట్ కాస్త నెమ్మదిగా ఉండి బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించా. మదుషంక అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కానీ గిల్, విరాట్ను అడ్డుకోవడంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. లేకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఇక భారత బౌలర్లు తొలి ఆరు ఓవర్లు అద్భుతంగా వేశారు. అందుకే, ఈ విజయం క్రెడిట్ అంతా వారికే దక్కుతుంది. మేం ఇంకా రెండు మ్యాచ్లు ఆడాలి. తప్పకుండా పుంజుకుని విజయం కోసం పోరాడతాం’’ అని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (Kushal Mendis) తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్