SA vs IND: అతడు లేని లోటు కనిపించడం లేదు.. రోహిత్ టెస్టు మోడ్లోకి రావాలి
మహ్మద్ షమి (Mohammed Shami) అందుబాటులో లేకున్నా టీమ్ఇండియా (Team India) బౌలింగ్ లైనప్ బలంగానే ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా (Temba Bavum) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య రేపటి (డిసెంబరు 26) నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత టీమ్ఇండియా అగ్రశ్రేణి జట్టుతో ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతోపాటు సీనియర్ ఫాస్ట్బౌలర్ బుమ్రా ఈ సిరీస్లో ఆడుతున్నారు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న షమి (Mohammed Shami) మాత్రం టెస్టు సిరీస్కు దూరంగా ఉన్నాడు. షమి అందుబాటులో లేకపోవడం టీమ్ఇండియా (Team India)కు లోటేనని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా (Temba Bavum) ఇందుకు భిన్నంగా స్పందించాడు. అతడు లేకున్నా ప్రస్తుత భారత జట్టు బలంగానే ఉందని పేర్కొన్నాడు. తొలి టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బావుమా మాట్లాడాడు.
‘‘క్రికెటర్లుగా అత్యుత్తమ ప్రత్యర్థితో తలపడాలని భావించడం సహజం. షమి కూడా అదే కోవకు చెందుతాడు. అతడు అద్భుతమైన పేసర్. మా జట్టులో చాలామంది అతడి బౌలింగ్లో ఆడాలనుకుంటారు. కానీ, టీమ్ఇండియా.. టీమ్ఇండియానే. వారికి బలమైన జట్టు ఉంది. అతడి స్థానంలో ఎవరు బౌలింగ్ చేసినా మమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తారు. సొంతగడ్డపై ఆడటం మాకు సానుకూలాంశమే అయినా.. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న భారత్తో పోటీ సవాలుతో కూడుకున్నదే. షమి లేకున్నా భారత బౌలింగ్ దళం పటిష్ఠంగానే ఉంది. గత 5-10 ఏళ్లలో టెస్టుల్లో భారత్ అద్భుత విజయాలు సాధించింది. బౌలింగ్ ఎటాక్ బలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది’’ అని బావుమా పేర్కొన్నాడు.
రోహిత్ టెస్టు మోడ్లోకి రావాలి: సునీల్ గావస్కర్
సఫారీలతో టెస్టు సిరీస్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు కీలకం కానుంది. కెప్టెన్గా, బ్యాటర్గా రాణించి.. జట్టును విజేతగా నిలిపితే అతడి పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఒకవేళ రోహిత్ విఫలమైతే.. అది అతడి భవితవ్యంపైనా ప్రభావం చూపే ఆస్కారముంది. ఈ నేపథ్యంలోనే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) రోహిత్ శర్మకు కీలక సూచన చేశాడు. ‘‘రోహిత్ మొట్టమొదటగా తన మానసిక స్థితిని టెస్టు మ్యాచ్లకు అనుగుణంగా మార్చుకోవాలి. అతడు వన్డే ఫార్మాట్లో దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ స్కోరు చేయాలని ప్రయత్నించాడు. ప్రపంచకప్లో ఎలా ఆడాడో మనం చూశాం. కానీ, టెస్టు క్రికెట్కు వచ్చేసరికి ఈ విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఎందుకంటే, ఈ ఫార్మాట్లో రోజంతా బ్యాటింగ్ చేయాలనే కోణంలో ఆలోచించాలి. రోహిత్ రోజంతా బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా తనదైన షాట్లతో చెలరేగి 150 కంటే ఎక్కువ స్కోరు చేస్తాడు. అదే జరిగితే టీమ్ఇండియా స్కోరుబోర్డుపై 300 లేదా 350 కంటే ఎక్కువ పరుగులు ఉంటాయి’’ అని సునీల్ గావస్కర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?