Thomas Cup: మా వాట్సప్ గ్రూప్నకూ ఆ పేరే పెట్టాం: కిదాంబి శ్రీకాంత్
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ప్రతిష్ఠాత్మక థామస్ కప్ను సొంతం చేసుకున్నారు మన షట్లర్లు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క పతకం
ఇంటర్నెట్డెస్క్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ప్రతిష్ఠాత్మక థామస్ కప్ను సొంతం చేసుకున్నారు మన షట్లర్లు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా గెలవని భారత పురుషుల జట్టు.. ఏకంగా స్వర్ణంతో సత్తాచాటింది. అయితే ఈ టోర్నీ ముందు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ.. సమష్టి కృష్టి, పట్టుదలతో తాము ఈ విజయాన్ని సాధించగలిగామని అన్నాడు స్టార్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్.
మ్యాచ్ అనంతరం బ్యాడ్మింటర్ వరల్డ్ ఫెడరేషన్తో మాట్లాడిన శ్రీకాంత్.. టోర్నీకి ముందు జరిగిన ఆసక్తికర ఘటనలను గుర్తుచేసుకున్నాడు. ‘‘ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కొరియా మాస్టర్స్లో ఆడేందుకు నేను దక్షిణ కొరియా వచ్చాను. ఆ తర్వాతి వారమే సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. ట్రయల్స్ పూర్తయిన వెంటనే థామస్ కప్ టోర్నీకి జట్టును ప్రకటించారు. ఆ తర్వాత జట్టు సభ్యులమంతా ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. దాని పేరేంటో తెలుసా.. ‘కప్తోనే ఇంటికి (We’ll Bring It Home)’. ఇదంతా టోర్నీకి ఒక వారం ముందు జరిగింది. అంటే, కప్పు సాధించే సత్తా, సామర్థ్యం మాకుందని మాకు మేము స్ఫూర్తి నింపుకొనేందుకు అలా పెట్టుకున్నాం. అయితే దీనికి పట్టుదల కూడా చాలా అవసరం’’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
జట్టు పరంగా తామంతా ఓ అద్భుతమైన బృందమని అన్నాడు. ‘‘ఈ బృందంలో అనుభవమున్న సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. మా మధ్య అనుబంధమే మేం సమష్టిగా రాణించేలా చేసింది. ఒత్తిడి సమయంలో పరస్పరం వెన్నుండి ప్రోత్సహించుకునేవాళ్లం. ఒకరి విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ముఖ్యంగా క్వార్టర్స్, సెమీస్లో అయితే ఇండియన్ క్యాంప్ నుంచి హెచ్ఎస్పీ.. హెచ్ఎస్పీ (హెచ్ఎస్ ప్రణయ్) అని వినిపించిన కేకలు మాలో మరింత స్ఫూర్తి నింపాయి’’ అని శ్రీకాంత్ ఆనందాన్ని పంచుకున్నారు.
సంతోషంతో నిద్ర పట్టలేదు: ప్రణయ్
థామస్కప్లో విజయం సాధించడంతో జట్టు ఆటగాళ్లంతా సంతోషంలో మునిగిపోయారు. ‘‘నాకు పడుకోవాలని అనిపించింది. కానీ నిద్ర పట్టలేదు. ఎందుకంటే మేం ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్స్’’ అంటూ హెచ్ఎస్ ప్రణయ్ ట్విటర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. క్వార్టర్స్, సెమీస్లో ప్రత్యర్థులతో భారత స్కోరు 2-2తో సమమైనప్పుడు ప్రణయ్ అద్భుతమైన ప్రదర్శన చేసి మ్యాచ్లను గెలిపించాడు.
ఆదివారం జరిగిన థామస్కప్లో భారత్ 3-0తో 14 సార్లు విజేత అయిన ఇండోనేషియాను మట్టికరిపించిన విషయం తెలిసిందే. థామస్ కప్లో ఇప్పటివరకు కనీసం సెమీస్ కూడా చేరని భారత్.. స్వర్ణంతో బోణీకొట్టడం విశేషం. వరుసగా రెండు సింగిల్స్, ఒక డబుల్స్లో గెలిచి.. రెండో డబుల్స్, మూడో సింగిల్స్తో పనిలేకుండా భారత్ ఛాంపియన్గా అవతరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు