AFG vs RSA: డస్సెన్ కీలక ఇన్నింగ్స్.. అఫ్గాన్పై సఫారీల విజయం
అహ్మదాబాద్ వేదిగా అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో తన చివరి లీగ్మ్యాచ్లో గెలుపొందింది.
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్లోని (ODI Worldcup) తన చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా (South Africa) విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా అఫ్గానిస్థాన్తో (Afghanistan) జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తం 9 మ్యాచుల్లో ఏడింట విజయం సాధించి +1.376 రన్రేట్తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. డస్సెన్ (76*; 95 బంతుల్లో 6×4,1×6) అర్ధశతకంతో చెలరేగిన వేళ.. 47.3 ఓవర్లలోనే సఫారీ జట్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు.. ఓపెనర్లు డికాక్ (41; 47 బంతుల్లో 2×4, 3×6), బవుమా (23; 28 బంతుల్లో 3×4) శుభారంభాన్నిచ్చారు. క్రీజులో నిలదొక్కుకుంటూ వేగంగా పరుగులు రాబట్టారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముజీబ్ విడగొట్టాడు. 11వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయిన బవుమా గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడికి రెండు ఓవర్ల వ్యవధిలోనే డికాక్ కూడా నబీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
డస్సెన్ మెరిసెన్..
తొలి డౌన్లో వచ్చిన డస్సెన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు మార్క్రమ్ (25),క్లాసెన్ (10), డేవిడ్ మిల్లర్ (24) తక్కువ స్కోరుకే ఔటైనప్పటికీ.. తాను మాత్రం పట్టువిడవకుండా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చివరి 10 ఓవర్లలో 53 పరుగులు చేయాల్సిన తరుణంలో అఫ్గాన్ బౌలర్లు కూడా సఫారీలను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక దశలో సమీకరణాలు 42-42, 36-36, 22-23గా నమోదయ్యాయి. ఓ వైపు అనుభవజ్ఞుడైన డస్సెన్ క్రీజులో ఉండటంతో సఫారీలు పెద్దగా ఆందోళన చెందకపోయినప్పటికీ.. అఫ్గాన్ బౌలర్ల ప్రయత్నలోపం లేదనే చెప్పాలి. చివరి మూడు బంతులకు రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో విజయం లాంఛనమైంది. డస్సెన్, అండిల్ ( 39*) నాటౌట్గా నిలిచారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహమ్మద్ నబి చెరో 2 వికెట్లు తీయగా.. ముజీబ్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఒమర్జాయ్ అద్భుత ఇన్నింగ్స్ వృథా
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటయ్యింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (97*; 107 బంతుల్లో 7×4, 3×6) ఒంటరి పోరాటం చేసిన వేళ అఫ్గాన్ 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొనేందుకు అఫ్గాన్ బ్యాటర్లు ఇబ్బంది పడిన వేళ ఒమర్జాయ్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మరో మూడు పరుగులు చేసి ఉంటే శతకం అతడి ఖాతాలో పడేది. కానీ, అదృష్టం వరించలేదు. ఇక అఫ్గాన్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రహ్మాత్ షా 26, హష్మతుల్లా షాహిది 2, ఇక్రామ్ అలిఖిల్ 12, మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 14, నూర్ అహ్మద్ 26, ముజీబ్ 8, నవీన్-ఉల్-హక్ 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 2 , గెరాల్డ్ కోయిట్జీ 4 , కేశవ్ మహరాజ్ 2, ఫెహ్లూక్వాయో ఒక వికెట్ తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు