Tokyo Olympics: అబ్బాయిల బాటలోనే..! హాకీ సెమీస్లో 1-2 తేడాతో ఓడిన రాణి రాంపాల్ సేన
అమ్మాయిలు.. అబ్బాయిల బాటలోనే నడిచారు! ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించే అవకాశం చేజార్చుకున్నారు. ప్రపంచ నంబర్వన్ అర్జెంటీనాపై పోరాడి ఓడారు....
ఇక కాంస్య కోసమే భారత్ పోరాటం
టోక్యో: అమ్మాయిలు.. అబ్బాయిల బాటలోనే నడిచారు! ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించే అవకాశం చేజార్చుకున్నారు. ప్రపంచ నంబర్వన్ అర్జెంటీనాపై పోరాడి ఓడారు. ఇక కాంస్య పోరుపైనే వారి ఆశలన్నీ! కీలకమైన సెమీస్లో రాణి రాంపాల్ సేన 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి నిమిషం వరకు విజయం కోసం ప్రయత్నించినా.. ప్రత్యర్థి జట్టు తమ అనుభవంతో ఆ ప్రయత్నాలను అడ్డుకొంది. భారత్ నుంచి గుర్జీత్ కౌర్ గోల్ చేయగా అర్జెంటీనాలో మరియా నోయెల్ 2 గోల్స్ చేసింది.
మొదటి గోల్ మనదే
ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే టీమ్ఇండియా గోల్ చేసింది. పెనాల్టీ కార్నర్ను గుర్జిత్ కౌర్ సద్వినియోగం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. బంతిని తమ అధీనంలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి క్వార్టర్ను 1-0తో ముగించింది రాంపాల్ సేన. ఈ క్రమంలో టీమ్ఇండియా చేసిన కొన్ని పొరపాట్లు అర్జెంటీనాకు కలిసొచ్చాయి. 18వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ను ప్రత్యర్థి సారథి మరియా నోయెల్ గోల్గా మలిచింది. దాంతో 1-1తో రెండో క్వార్టర్ ముగిసింది.
అర్జెంటీనా కెప్టెన్ అద్భుతం
మూడో క్వార్టర్లో రాణి జట్టు గోల్ చేసేందుకు విపరీతంగా శ్రమించింది. అయితే అర్జెంటీనా భారత గోల్ పోస్ట్పై దాడులు చేసి ఒత్తిడి పెంచింది. పదేపదే వృత్తం వద్దకు చేరుకోవడంతో 36వ నిమిషంలో వారికి పెనాల్టీ కార్నర్ లభించింది. మరియా ప్రమాదకరంగా ఆడుతూ దానిని గోల్గా మలిచింది. గోల్కీపర్ సవిత దానిని అడ్డుకోలేక పోయింది. 2-1తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లడంతో భారత్పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఆఖరి క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు రాణి సేన ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అయ్యాయి. ఎట్టకేలకు ఒక పీసీ భారత్కు వచ్చినా ప్రత్యర్థి గోల్ కీపర్ దానిని మరియా బెలెన్ దానిని అడ్డుకుంది. ఆట అర నిమిషంలో ముగుస్తుందనగా వచ్చిన ఫ్రీహిట్ను గోల్ చేసేందుకు టీమ్ఇండియా ప్రయత్నిస్తే మళ్లీ బెలెన్ కిందపడి మరీ ఆపేయడంతో భారత్ ఆశలు అడియాసలు అయ్యాయి.
అర్జెంటీనా ఆరు పెనాల్టీ కార్నర్లలో 2 గోల్స్ చేయగా భారత్కు వచ్చిన 3 పీసీల్లో రెండింటిని ప్రత్యర్థి విజయవంతంగా అడ్డుకొంది. పురుషుల జట్టు సైతం బెల్జియంకు విపరీతమైన పీసీలు ఇవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.