INDvsENG: రెండో రోజు ఆట పూర్తి.. ఇంగ్లాండ్ 119/3
టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ దీటుగా ఆడుతోంది. కెప్టెన్ జో రూట్ (48 నాటౌట్; 75 బంతుల్లో 6x4) మరో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు...
లండన్: టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ దీటుగా ఆడుతోంది. కెప్టెన్ జో రూట్ (48 నాటౌట్; 75 బంతుల్లో 6x4) మరో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడికి ఓపెనర్ రోరీ బర్న్స్ (49; 136 బంతుల్లో 7x4) చక్కటి సహకారం అందించాడు. దాంతో వీరిద్దరూ మూడో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 119/3 స్కోర్తో నిలిచింది. రూట్, బెయిర్స్టో (6 నాటౌట్; 17 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమ్ఇండియా 276/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించగా 364 పరుగులకు ఆలౌటైంది.
గురువారం శతకంతో చెలరేగిన కేఎల్ రాహుల్ (129; 250 బంతుల్లో 12x4, 1x6) రెండో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే ఔటయ్యాడు. మరుసటి ఓవర్లోనే అజింక్య రహానె(1) సైతం పెవిలియన్ చేరాడు. రాబిన్సన్ వేసిన తొలి ఓవర్లో రాహుల్.. సిబ్లీ చేతికి చిక్కగా తర్వాత అండర్సన్ బౌలింగ్లో రహానె.. రూట్ చేతికి చిక్కాడు. దాంతో టీమ్ఇండియా ఆరు పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది. అనంతరం జడేజా (40; 120 బంతుల్లో 3x4), రిషభ్ పంత్ (37; 58 బంతుల్లో 5x4) కాస్త నిలకడగా ఆడి ఆరో వికెట్కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, పంత్ వేగంగా ఆడే క్రమంలో మార్క్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 331/6గా నమోదైంది. మరుసటి ఓవర్లో షమి(0) కూడా పెవిలియన్ చేరాడు. ఆపై జడేజా, ఇషాంత్(8) కొంచెంసేపు నిలకడగా ఆడి ఎనిమిదో వికెట్కు 26 పరుగులు జోడించారు. అయితే, జట్టు స్కోర్ 362 పరుగుల వద్ద ఇషాంత్ ఔటైన తర్వాత బుమ్రా, జడేజా సైతం ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ ఐదు వికెట్లు, రాబిన్సన్, మార్క్వుడ్ చెరో రెండు, మోయిన్ అలీ ఒక వికెట్ తీశారు.
ఇక ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సిరాజ్ వేసిన 15వ ఓవర్లో సిబ్లీ(11), హసీబ్ హమీద్(0) ఔటయ్యారు. తర్వాత జోడీ కట్టిన రూట్, బర్న్స్ నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో షమి.. బర్న్స్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. దాంతో ఇంగ్లాండ్ 108 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇక మూడో రోజు టీమ్ఇండియా బౌలర్లు రూట్, బెయిర్స్టోను ఎంత త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్పై అంత పట్టు సాధించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి