IPL 2021: రోహిత్కు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం: జయవర్దెనె
ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, అయితే.. తర్వాత కోల్కతాతో జరిగే మ్యాచ్లో బరిలోకి దిగుతాడని ఆ జట్టు కోచ్ మహేలా జయవర్దెనె స్పష్టం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఆ జట్టు కోచ్ మహేలా జయవర్దెనె తెలిపాడు. కోల్కతాతో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని వెల్లడించాడు. ఐపీఎల్ 14వ సీజన్లో ఆదివారం ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ధోనీసేన నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి 136/8 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమిపాలై ఈ సీజన్లో నాలుగు ఓటములు మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం జయవర్దెనె మాట్లాడుతూ తమ కెప్టెన్కు మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలిపాడు. ‘రోహిత్ బాగానే ఉన్నాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా బాగుంది. అయితే, సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటన నుంచి వచ్చిన అతడకి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. తర్వాత కోల్కతాతో జరిగే మ్యాచ్లో పాల్గొంటాడు’ అని స్పష్టం చేశాడు. మరోవైపు రోహిత్తో పాటు ఈ మ్యాచ్లో కీలక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సైతం బరిలోకి దిగలేదు. అతడిపై స్పందించిన జయవర్దెనె.. పాండ్యకు చిన్న సమస్య ఎదురైందని, ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి కల్పించామన్నాడు. అనంతరం ముంబయి ఓటమిపై మాట్లాడుతూ.. చెన్నై జట్టులో రుతురాజ్ లాగా తమ జట్టులో ఎవరైనా బ్యాటింగ్ బాధ్యతలు తీసుకోవాల్సిందన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.