మూడు రనౌట్లా? అది కూడా టెస్టుల్లోనా!
సుదీర్ఘ ఫార్మాట్లో బ్యాట్స్మెన్ను ఔట్ చేయాలంటే బౌలర్లు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. వన్డే, టీ20ల్లో వేగంగా పరుగులు సాధించాలనే తొందరలో బ్యాట్స్మెన్ చేసే తప్పిదాలను ఉపయోగించుకుని బోల్తాకొట్టిస్తుంటారు...
ఇంటర్నెట్డెస్క్: సుదీర్ఘ ఫార్మాట్లో బ్యాట్స్మెన్ను ఔట్ చేయాలంటే బౌలర్లు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. వన్డే, టీ20ల్లో అయితే.. వేగంగా పరుగులు సాధించాలనే తొందరలో బ్యాట్స్మెన్ చేసే తప్పిదాలను ఉపయోగించుకుని కాస్త సులువుగా బోల్తా కొట్టిస్తుంటారు. కానీ, టెస్టుల్లో వికెట్ను కాపాడుకోవడానికే బ్యాట్స్మెన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి టెస్టులో వికెట్లు దక్కాలంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కంటే బౌలర్లు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అందుకే బ్యాట్స్మెన్తో తప్పులు చేయించేలా ప్రణాళికతో బంతులు వేస్తుంటారు.
ఇక టెస్టుల్లో రనౌట్ అయ్యే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బ్యాట్స్మెన్ రనౌట్ అవుతుంటారు. కానీ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ ఏకంగా ముగ్గురు ఔటవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆతిథ్య జట్టుకు ఉచితంగా వికెట్లు సమర్పించుకున్నారని విశ్లేషకులు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్ సిరీస్లో అయిదుగురు భారత బ్యాట్స్మన్ రనౌటవ్వడం గమనార్హం. తొలి టెస్టులో కోహ్లీ, రెండో టెస్టులో రహానె ఔటవ్వగా.. సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా రనౌటయ్యారు.
ఒక టెస్టు సిరీస్లో భారత టాప్-8 బ్యాట్స్మెన్లో నలుగురు అంతకంటే ఎక్కువ మంది రనౌటవ్వడం 1989 తర్వాత ఇదే తొలిసారి. 1989/90 పాకిస్థాన్ పర్యటనలో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. దీనిలో మంజ్రేకర్, అజారుద్దీన్, నవ్జోత్ సిద్ధు, ప్రభాకర్, సచిన్ తెందుల్కర్ రనౌటయ్యారు. కాగా, ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలోనూ టాప్-8 బ్యాట్స్మెన్లో కోహ్లీ, రహానె, విహారి, అశ్విన్ ఔటవ్వడం గమనార్హం.
ఇక ఒక టెస్టు ఇన్నింగ్స్లో ముగ్గురు అంతకంటే ఎక్కువ భారత ఆటగాళ్లు రనౌటవ్వడం ఇది ఏడో సారి. చివరిగా 2008లో మొహాలి వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ రనౌటయ్యారు. కాగా, సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్మెన్ అనవసర తప్పిదాలు చేయడంతో తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు కుప్పకూలింది. భారీ స్కోరు సాధించే అవకాశం ఉన్నా రనౌట్లతో సాధించలేకపోయింది. మొత్తంగా శనివారం ఆట ముగిసేసమయానికి ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.