PCB: లబుషేన్‌ ‘దాల్‌, రోటీ’ ట్వీట్‌.. పాక్‌ క్రికెట్‌ బోర్డుపై ట్రోల్స్‌!

దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. మూడు టెస్టుల...

Published : 13 Mar 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. చాన్నాళ్ల తర్వాత పర్యటనకు వచ్చిన ఆసీస్‌కు పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారీ భద్రతను కల్పించింది. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేందుకు కసరత్తు చేసింది. అయితే ఆసీస్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ నిన్న సాయంత్రం చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే..?

ఆసీస్ ఆటగాళ్లు భోజనం అలవాట్లు ఉపఖండానికి భిన్నంగా ఉంటాయి. అయితే పాక్‌ క్రికెట్ బోర్డు లంచ్‌లో భాగంగా ‘పప్పు, రోటీ’ భోజనం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోను మార్నస్‌ లబుషేన్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘‘లంచ్‌ కోసం దాల్ (పప్పు), రోటీ.. రుచికరంగా ఉంది’’ అని క్యాప్షన్‌ జోడించాడు. దీంతో నెటిజన్లు కామెంట్లతో చెలరేగిపోయారు. ‘నువ్వు ట్రోల్స్‌కు గురవుతున్నందుకు క్షమించాలి. మీకు వడ్డించిన రోటీలు సరిగా కాల్చినవి కావు. అలానే అది నీళ్ల పప్పు’.. ‘ఇలాంటి భోజనం ఆసుపత్రిలోనే పెడతారు. త్వరలో కలుద్దాం బ్రో’.. ‘ఇది పెషావర్ జైలులో వడ్డించే భోజనం’.. ‘ భారత జైళ్లలో ఉండేవారే దీనికంటే మంచి భోజనం తినగలుగుతున్నారు.. అయితే మీరు ఇప్పుడు పాకిస్థాన్‌కు అతిథులు’’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌X పాక్‌ మధ్య ఇవాల్టి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని