IND vs SA: రోహిత్ను విరాట్ అధిగమిస్తాడా..? రికార్డును ఖాతాలో వేసుకొంటాడా..?
ఆసీస్తో సిరీస్ నెగ్గి ఊపు మీదున్న టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్ ముగింట భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ కూడా..
మరికాసేపట్లో దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా తొలి టీ20
ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్తో సిరీస్ నెగ్గి ఊపు మీదున్న టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్ 2022 ముంగిట భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇవాళ తిరువనంతపురం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ రికార్డు కోసం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పోటీపడనున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటారా..? అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా అవతరించే అవకాశం విరాట్ కోహ్లీ ముందుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ 139 మ్యాచుల్లో 4 శతకాలు, 28 అర్ధశతకాలతో 3,694 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం 107 మ్యాచుల్లోనే ఒక శతకం, 33 అర్ధశతకాలతో 3,660 పరుగులతో రెండు స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (3,497 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఇంకో 35 పరుగులు చేస్తే రోహిత్ను అధిగమిస్తాడు. రోహిత్ కూడా దూకుడుగా ఆడి తన ర్యాంక్ను సుస్థిరం చేసుకుంటాడన్న విషయం తెలియాలంటే వేచి చూడాలి.
శ్రేయస్కు అవకాశం
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి దీపక్ హుడా గాయం కారణంగా వైదొలిగాడు. అలాగే శ్రేయస్ అయ్యర్, షాహబాజ్ అహ్మద్, ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20ల సిరీస్ నుంచి దీపక్ హుడా వైదొలిగాడు. వెన్నునొప్పి కారణంగా జాతీయ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకొంటాడు. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ కూడా రెస్ట్ తీసుకుంటారు. మహమ్మద్ షమీకి కరోనా నెగిటివ్ వచ్చినా కాస్త వీక్నెస్గా ఉండటంతో జట్టుతో కలవడు. అయితే అర్ష్దీప్ సింగ్ వచ్చేశాడు. అతడితోపాటు శ్రేయస్ అయ్యర్, షహబాజ్ అహ్మద్, ఉమేశ్ యాదవ్కు జట్టులో స్థానం కల్పించాం’’ అని బీసీసీఐ వెల్లడించింది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షహబాబ్ అహ్మద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు