IPL 2022: ఐపీఎల్ వేలంలోలార్డ్కి వెల కట్టలేం.. శార్దూల్పై చాహల్ ఛలోక్తి
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022కు సంబంధించిన మెగా వేలం జరగనుంది. దీంతో ఫ్రాంఛైజీల యాజమాన్యాల నుంచి అభిమానుల వరకు అందరి దృష్టీ క్రికెటర్లపైనే నెలకొని ఉంది...
శార్దూల్, రాహుల్, చాహల్ ఫన్నీ వీడియో
ఇంటర్నెట్డెస్క్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022కు సంబంధించిన మెగా వేలం జరగనుంది. దీంతో ఫ్రాంఛైజీల యాజమాన్యాల నుంచి అభిమానుల వరకూ అందరి దృష్టి క్రికెటర్లపైనే ఉంది. ఏయే ఆటగాడు ఏయే జట్టుకు ఎంపికవుతాడు.. ఎంత ధర పలుకుతాడనే విషయాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు ఈ ఏడాది రెండు కొత్త జట్లు మెగా ఈవెంట్లో చేరడంతో మరింత మంది క్రికెటర్లకు సైతం ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కనుంది. ఈ క్రమంలోనే ఇంతకుముందు పంజాబ్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్.. ఇప్పుడు లఖ్నవూ జట్టుకు సారథిగా నియమితుడయ్యాడు. అతడిని ఆర్పీఎస్జీ గ్రూప్ భారీ మొత్తానికి దక్కించుకుంది.
కాగా, ఈ మెగావేలం నేపథ్యంలోనే టీమ్ఇండియా క్రికెటర్లు రాహుల్, శార్దూల్, యుజువేంద్ర చాహల్ ఓ సరదా సంభాషణలో పాల్గొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఓ హోటల్కు వెళ్లిన ఈ ముగ్గురు ఆసక్తికర సంభాషణ సాగించారు. తొలుత శార్దూల్ మాట్లాడుతూ.. ‘ఈసారి వేలంలో నాకోసం మీ బడ్జెట్ ఎంత?’ అని సరదాగా రాహుల్ను అడిగాడు. దీనికి లఖ్నవూ సారథి బదులిస్తూ.. ‘నీకైతే బేస్ ప్రైజ్’ అని సమాధానమిచ్చాడు. అనంతరం చాహల్ కలగజేసుకొని.. ‘దేవుడికి వెల కట్టలేం బ్రో’ అని ఓ ఛలోక్తి విసిరాడు. శార్దూల్ను లార్డ్ శార్దూల్ అని సంబోధించడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. కాగా, ఈ ఆల్రౌండర్ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడగా.. చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పాల్గొన్నాడు. మరి ఈసారి మెగా వేలంలో ఈ ఇద్దరు ఏ జట్లకు ఎంపికవుతారో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు