అంచనా కంటే ఎక్కువకు ‘బసవేశ్వర’ టెండర్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు నుంచి లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనిని అంచనా కంటే ఎక్కువకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎం.ఐ.ఇ.ఎల్) దక్కించుకొంది.
ఈనాడు హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు నుంచి లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనిని అంచనా కంటే ఎక్కువకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎం.ఐ.ఇ.ఎల్) దక్కించుకొంది. సింగూరు నుంచి నీటిని మళ్లించేందుకు నిర్మించే లిఫ్టుతోపాటు ప్రధాన కాలువ, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని మొత్తం 8 మండలాల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనికి పిలిచిన టెండర్ ప్రైస్ బిడ్ను సంబంధిత ఇంజినీర్లు బుధవారం తెరిచారు. రూ.1,422 కోట్ల అంచనాతో పిలిచిన ఈ పనికి రెండు కంపెనీలు టెండర్ దాఖలు చేయగా, రెండూ సాంకేతికంగా అర్హత సాధించాయి. ఇద్దరి ప్రైస్బిడ్ తెరవగా రూ.1,487 కోట్లతో పని విలువపై 4.6 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్-1గా రాగా, రూ.1,490 కోట్లతో 4.8 శాతం ఎక్కువకు దాఖలు చేసిన ఎన్.సి.సి సంస్థ ఎల్-2గా వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం