Telangana News: తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు.. ఒకరి మృతి
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 19,527 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 19,527 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,89,083కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న 401 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో ఇవాళ 64 కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.