British Rule: బయట రాబందులు.. లోన రాచవిందులు
1870 ప్రాంతంలో దక్కన్ పీఠభూమి క్షామాన్ని ఎదుర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. వీటికి తోడు బ్రిటిష్ ప్రభుత్వం ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను ప్రోత్సహించటంతో ఆహారధాన్యాల ఉత్పత్తి ...
వాళ్లు సత్యాగ్రహులు కాదు...
నిరసనా తెలపలేదు...
తిరుగుబాట్లూ చేయలేదు...
ప్రకృతి కన్నెర్రకు బలైన బడుగు జీవులు!
తినటానికి మెతుకు లేక ఎముకల గూళ్లుగా మారిన వారిని చూసి బండలు సైతం కరిగాయి... కానీ బ్రిటిష్వారి గుండెలు కరగలేదు. బయట లక్షల మంది అన్నార్తుల మరణ మృదంగం వినిపిస్తుంటే.. దర్బార్లో రాణి పేరిట లక్షల ఖర్చుతో విందులు వినోదాలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం!
1870 ప్రాంతంలో దక్కన్ పీఠభూమి క్షామాన్ని ఎదుర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. వీటికి తోడు బ్రిటిష్ ప్రభుత్వం ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను ప్రోత్సహించటంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గింది. పండిన పంటను కూడా ప్రజలకు పంచే బదులు ఐరోపాకు ఎగుమతి చేయటంపైనే బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిసారించింది. మద్రాసు రాష్ట్రంలో ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ అల్లాడుతుంటే... సుమారు 3లక్షల 20వేల టన్నుల గోధుమల్ని ఇంగ్లాండ్కు ఓడల్లో ఎక్కించాడు అప్పటి వైస్రాయి లార్డ్ రాబర్ట్ లిటన్. 1876-77నాటికి కరవు తీవ్రమైంది. రోజుల తరబడి తిండి లేక మద్రాసు రాష్ట్రంలో రోడ్లపైనే వేలమంది మరణిస్తున్న వేళ ప్రజలను ఆదుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు సాయం చేస్తే... వారికదే అలవాటవుతుంది. ఆశిస్తూనే ఉంటారలా’ అంటూ వారి ప్రాణాలను గాలికి వదిలేశాడు వైస్రాయి లిటన్!
స్వేచ్ఛా మార్కెట్లో ప్రభుత్వం తలదూర్చకూడదన్న ఆర్థిక సిద్ధాంతాన్ని అనుసరించిన ఆంగ్లేయులు ప్రజల పట్ల బాధ్యతను మరిచారు. అలాగని ఆర్థిక క్రమశిక్షణ ఏమైనా పాటించారా అంటే అదీ లేదు. ఒకవైపు వీధుల్లో రాబందులు రాజ్యమేలుతుంటే... 1877లో దిల్లీ దర్బార్ పేరిట లక్షల రూపాయలతో గానాబజానా ఏర్పాటు చేశారు. విక్టోరియా రాణి భారత్కు కూడా ఇకమీదట రాణి అని ప్రకటించటానికి ఏర్పాటు చేసిన ఈ హంగామా వారంపాటు సాగింది. వివిధ సంస్థానాల రాజులు, మహారాజులతో మొదలెడితే... దాదాపు 70వేల మందికి అత్యంత ఖరీదైన ఆతిథ్యం ఇచ్చారు. ‘‘బయట లక్షలమంది మరణిస్తుంటే... దర్బార్లో లక్షల రూపాయలు పారబోస్తున్నారు...’’ అంటూ రాశాడో విదేశీ పాత్రికేయుడు.
పోనీ... బతికున్నవారు కష్టపడి సంపాదించుకుందామంటే దానికీ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ తామున్నచోటి నుంచి 10 కిలోమీటర్ల బయటే పనిచేయాలన్న నిబంధన పెట్టింది. అసలే తిండిలేక చేతగాని స్థితిలో ఉన్న ఆ బడుగు జీవులు... పనికోసం పదికిలోమీటర్లు నడిచే క్రమంలో... వేలమంది రోడ్లమీదే ప్రాణాలు విడిచారు. దాదాపు 5.5లక్షల మంది ఆ క్షామంలో మృత్యువాత పడ్డారు.
నిర్దయకు నజరానా
అంతకుముందు 1874 బెంగాల్ క్షామం సమయంలో అక్కడ పనిచేసిన రిచర్డ్ టెంపుల్ అనే అధికారికే ఈసారి మద్రాసులో సహాయ కార్యక్రమాల బాధ్యత అప్పగించారు. గమ్మత్తేమంటే... బెంగాల్లో ఉన్నప్పుడు మానవతతో బర్మా నుంచి బియ్యం తెప్పించి... ప్రజలకు టెంపుల్ అంతో ఇంతో సాయం చేశారు. మరణాలను తగ్గించేందుకు ప్రయత్నించారు. అందుకుగాను ఆయన్ను బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. వేధించింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయన... మద్రాసులో తన గుండెను, కళ్లను పూర్తిగా మూసుకొని ప్రజలకు ఏమాత్రం సాయం అందకుండా కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వంతో శభాష్ అనిపించుకున్నారు. తర్వాత ఆయన్ను... ముంబయి గవర్నర్గా నియమించి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!