అంబేడ్కర్‌ ఆశయ సాధనతోనే ఆప్‌ ముందుకు: సోమ్‌నాథ్‌ భారతి

బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ పనిచేస్తోందని ఆప్‌ దక్షిణ భారత ఇన్‌ఛార్జి సోమ్‌నాథ్‌ భారతి అన్నారు. పార్టీ చేపట్టిన మహా...

Published : 15 Apr 2022 05:08 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ పనిచేస్తోందని ఆప్‌ దక్షిణ భారత ఇన్‌ఛార్జి సోమ్‌నాథ్‌ భారతి అన్నారు. పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను గురువారం ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నీతి నిజాయితీలతో దిల్లీలో పాలన సాగిస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ పనితీరును చూసి పంజాబ్‌లోనూ ప్రజలు అపూర్వ విజయం కట్టబెట్టారన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పార్టీని విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర సెర్చ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఇందిరా శోభన్‌ మాట్లాడుతూ.. దిల్లీ తరహాలో సంక్షేమ పథకాలు అమలుచేసి తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆప్‌ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ సమీపంలోని రోజ్‌కాలనీ, ఏవీ కళాశాల ప్రాంతాల్లో వీరు పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని