Prajwal rape victims: వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!

రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 05 May 2024 16:10 IST

బెళగావి: మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీ, ఆ రాష్ట్ర ఇంఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు.

‘బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. వారికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారు. ఇది భిన్నమైన కేసు. గడిచిన 75ఏళ్లలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు’ అని సుర్జేవాలా వెల్లడించారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ కూడా డిమాండ్‌ చేశారన్నారు. భాజపా కూటమిలో జేడీఎస్‌ ఉన్నందున.. వారిని రక్షించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని భాజపాను ప్రశ్నించారు.

ప్రజ్వల్‌ రేవణ్న బాధితులు 500 మంది పైనే?

ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేక పోయిందని కాంగ్రెస్‌ నేతలు నిలదీశారు. నిందితుడికి ఉన్న దౌత్య పాస్‌పోర్టును ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, అతడిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని