IPO: మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి.
దిల్లీ: వచ్చే వారం రోజుల్లో ప్రైమరీ మార్కెట్లో మళ్లీ సందడి నెలకొననుంది. మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. బ్లాక్స్టోన్ మద్దతున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ కంపెనీ ఇండెజీన్, ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ టీబీఓ టెక్ పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి.
2004 నుంచి మొదలుకొని గత నాలుగు సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఒక్క ఐపీఓ (IPO) కూడా రాలేదు. ఎన్నికల హడావుడి వల్ల ఏప్రిల్ - జూన్లో పబ్లిక్ ఇష్యూలు చాలా తక్కువగా ఉండేవి. ఈసారి మాత్రం ట్రెండ్ మారింది. వచ్చేవారం మూడు మెయిన్బోర్డు ఐపీఓలు రూ.6,400 కోట్ల సమీకరణకు సిద్ధమవడం విశేషం. భారత క్యాపిటల్ మార్కెట్లు, దేశ దీర్ఘకాల వృద్ధిపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇండెజీన్ ఐపీఓ..
ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్న ఇండెజీన్ ఐపీఓ (Indegene IPO) మే 6న ప్రారంభమై 8 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.430-452గా నిర్ణయించింది. మొత్తం రూ.1,842 కోట్లు సమీకరించనుంది. రూ.760 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ.1,082 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా పొందనుంది. మదుపర్లు కనీసం రూ.14,916తో (గరిష్ఠ ధర వద్ద) 33 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, మూలధన వ్యయాలు, కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఆధార్ హౌసింగ్ ఐపీఓ..
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ (Aadhar Housing Finance IPO) రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధరల శ్రేణిని రూ.300-315గా నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూలో సమీకరించిన నిధులను భవిష్యత్ మూలధన వ్యయాలతో పాటు కొంత సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం సమీకరణలో రూ.1,000 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. మరో రూ.2,000 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా పొందనుంది. రిటైల్ మదుపర్లు కనీసం రూ.14,805తో (గరిష్ఠ ధర వద్ద) 47 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
టీబీఓ టెక్ ఐపీఓ..
ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించేందుకు టీబీఓ టెక్ (TBO Tek IPO) సిద్ధమైంది. దీంట్లో రూ.400 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా కాగా.. మరో రూ.1,151 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ కింద సమీకరిస్తోంది. ధరల శ్రేణిని కంపెనీ రూ.875-920గా నిర్ణయించింది. మదుపర్లు కనీసం రూ.14,720తో (గరిష్ఠ ధర వద్ద) 16 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సమీకరించిన నిధులను ప్లాట్ఫామ్ను మరింత బలోపేతం చేయడానికి, కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.. -
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా అందించారు. -
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!