బీఎస్పీ పీఠమెక్కితే పోడు భూములకు పట్టాలు

బీఎస్పీ అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌, కురవి మండలాల్లో కొనసాగింది.

Published : 19 May 2022 05:03 IST

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి

డోర్నకల్‌, కురవి - న్యూస్‌టుడే: బీఎస్పీ అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌, కురవి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా డోర్నకల్‌ మండలం గొల్లచర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. అబద్ధపు హామీలివ్వడంలో కేసీఆర్‌ ఆరితేరిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ క్షేత్రసహాయకులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని శాసనసభ సాక్షిగా చెప్పి.. మాట నిలుపుకోవడం లేదని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని