బీఎస్పీ పీఠమెక్కితే పోడు భూములకు పట్టాలు
బీఎస్పీ అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కురవి మండలాల్లో కొనసాగింది.
ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ వెల్లడి
డోర్నకల్, కురవి - న్యూస్టుడే: బీఎస్పీ అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కురవి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా డోర్నకల్ మండలం గొల్లచర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. అబద్ధపు హామీలివ్వడంలో కేసీఆర్ ఆరితేరిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ క్షేత్రసహాయకులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని శాసనసభ సాక్షిగా చెప్పి.. మాట నిలుపుకోవడం లేదని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..