Vitamin D: స్వల్ప ఖర్చుతో.. విటమిన్-డి నిర్ధారణ పరీక్ష
తక్కువ సమయం.. స్వల్ప ఖర్చుతోనే విటమిన్-డి స్థాయులు గుర్తించే సరికొత్త విధానాన్ని (ర్యాపిడ్ సెన్సిటివ్ అడ్వాన్స్డ్ మాస్ స్పెక్టోమెట్రి మెథడ్ ఫర్ ఎవాల్యుయేషన్) ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు కనుగొన్నారు.
అభివృద్ధి చేసిన ఓయూ ఆచార్యుడు
- ఈనాడు, హైదరాబాద్
తక్కువ సమయం.. స్వల్ప ఖర్చుతోనే విటమిన్-డి స్థాయులు గుర్తించే సరికొత్త విధానాన్ని (ర్యాపిడ్ సెన్సిటివ్ అడ్వాన్స్డ్ మాస్ స్పెక్టోమెట్రి మెథడ్ ఫర్ ఎవాల్యుయేషన్) ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు కనుగొన్నారు. రసాయన శాస్త్ర ఆచార్యుడు డా.పి.మురళీధర్రెడ్డి నేతృత్వంలో దీన్ని రూపొందించారు. దీనికి తైవాన్కు చెందిన సుచీ మెడికల్ యూనివర్సిటీ ఆచార్యుడు ప్రొ.అన్రెన్ హు సహకారం అందించారు. విటమిన్-డి లోపంతో ఎముకల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొవిడ్ సోకి ఐసీయూ దశకు చేరిన రోగుల్లో విటమిన్-డి తక్కువ ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం దీని స్థాయులను గుర్తించేందుకు ‘కెమిల్యూమ్నిసెంట్ ఇమ్యునో అస్సె’ పరీక్ష అందుబాటులో ఉంది. దీనికి ప్రైవేటు ప్రయోగశాలల్లో రూ.500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. ఫలితాలు వచ్చేందుకు 35 నిమిషాలకుపైగా పడుతుంది. కొత్త విధానంలో 9 నిమిషాల్లోనే ఫలితం రాబట్టవచ్చు. కేవలం రూ.50 ఖర్చు అవుతుంది. ప్రయోగాత్మకంగా నిరూపితమైన ఈ విధానం ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరికొంతకాలం పట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?