‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’గా గరివిడి మహిళ
ఏపీలోని విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవ(ఎన్జీవో) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది ఆన్లైన్ వేదికగా ఈ అందాల పోటీలను నిర్వహించారు.
పద్మావతికి ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’ కిరీటం అలంకరిస్తున్న మమతా త్రివేది
గరివిడి, న్యూస్టుడే: ఏపీలోని విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవ(ఎన్జీవో) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది ఆన్లైన్ వేదికగా ఈ అందాల పోటీలను నిర్వహించారు. 2021 సెప్టెంబరులో జరిగిన ప్రాథమిక పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వంద మంది మహిళలు ఎంపిక కాగా వీరిలో 36 మంది అర్హత సాధించారు. ఈ నెల 16న నిర్వహించిన తుది పోటీల్లో మంచి ప్రతిభ చూపిన పద్మావతి ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’ టైటిల్ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్లో విశాఖపట్నంలో నిర్వహించిన శ్రీమతి వైజాగ్ పోటీల్లోనూ ఈమె ఫైనల్స్కు అర్హత సాధించినప్పటికీ కొవిడ్ కారణంగా పాల్గొనలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి