ప్రాణాలు విడుస్తూ.. బిడ్డకు జన్మనిచ్చి..
తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ జింక చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మొదటి ఘాట్రోడ్డులో వెళ్తున్న తితిదే పరకామణి బస్సు ముందు అకస్మాత్తుగా ఒక జింక దూకింది. డ్రైవర్ బ్రేకులు
తిరుమల ఘాట్రోడ్డులో బస్సు ఢీకొని జింక మృతి
తిరుమల, న్యూస్టుడే: తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ జింక చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మొదటి ఘాట్రోడ్డులో వెళ్తున్న తితిదే పరకామణి బస్సు ముందు అకస్మాత్తుగా ఒక జింక దూకింది. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించగా అప్పటికే టైర్ కిందపడి మృతి చెందింది. ఆ జింక గర్భందాల్చి ఉండటంతో పిల్ల కడుపులో నుంచి బయటపడింది. తితిదే అటవీశాఖ అధికారులు జింక పిల్లను ఎస్వీ జూకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.