Andhra News: సినీ ప్రముఖుల్ని అవమానించాల్సిన అవసరం జగన్‌కు లేదు: అలీ

‘చిరంజీవి ఇతర తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులను పిలిచి అవమానించాల్సిన అవసరం ఏపీ సీఎం జగన్‌కు ఏముంటుంది?’ అని సినీ నటుడు అలీ అన్నారు. ‘సామాన్యుడికీ సినిమా టికెట్‌ ధర అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా పెద్దలు కలిసినప్పుడు పరిశ్రమకు మంచి

Updated : 16 Feb 2022 07:11 IST

ఈనాడు, అమరావతి: ‘చిరంజీవి ఇతర తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులను పిలిచి అవమానించాల్సిన అవసరం ఏపీ సీఎం జగన్‌కు ఏముంటుంది?’ అని సినీ నటుడు అలీ అన్నారు. ‘సామాన్యుడికీ సినిమా టికెట్‌ ధర అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా పెద్దలు కలిసినప్పుడు పరిశ్రమకు మంచి జరిగేలా చూస్తామని సీఎం మాటిచ్చారు. ఆయన కచ్చితంగా చేస్తారు’ అని పేర్కొన్నారు. అలీ తన భార్యతో కలిసి మంగళవారం సీఎం జగన్‌ను కలిశారు. తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘నీకో శుభవార్త ఉంది.. రెండు వారాల్లో పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వస్తుందని సీఎం జగన్‌ చెప్పారు. ఆ శుభవార్త ఏమిటో నాకు తెలియదు’ అని తెలిపారు.  రాజ్యసభకు అవకాశంపై సీఎం నుంచి సంకేతం అందిందా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఏమీ అందలేదు’అని అలీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని