Samatha Murthy: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి వారంలో ఒకరోజు సెలవు.. ఎప్పుడంటే?

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ప్రతి బుధవారం సెలవు రోజుగా నిర్ణయించామని జీవాశ్రమం ప్రతినిధులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సందర్శన సమయాన్ని

Updated : 10 Mar 2022 07:58 IST

సందర్శన సమయం గంట పొడిగింపు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ప్రతి బుధవారం సెలవు రోజుగా నిర్ణయించామని జీవాశ్రమం ప్రతినిధులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సందర్శన సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉండేది. టికెట్‌ కౌంటర్లు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచిఉంటాయని వారు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని