వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి
కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడానికి అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు గురువారం హైకోర్టు అంగీకరించింది. గతంలోలా ఎలాంటి వివరాలు అడగకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే అభ్యంతరం లేదంది.
హైకోర్టు అంగీకారం
ఆధార్, కులం వివరాలు అడగబోమని సర్కారు హామీ
ఈనాడు, హైదరాబాద్: కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడానికి అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు గురువారం హైకోర్టు అంగీకరించింది. గతంలోలా ఎలాంటి వివరాలు అడగకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే అభ్యంతరం లేదంది. ఇందుకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకుని, ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) సమర్పిస్తే ఆన్లైన్లోగానీ, భౌతికంగా కానీ రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ నంబర్లు, కులం, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించబోమని కోర్టుకు హామీ ఇచ్చింది.
ఎలాంటి చట్టం లేకుండా ధరణి నమోదుతో పాటు కులం, ఆధార్ వివరాలు అడగటాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు కె.సాకేత్, ఐ.గోపాల్శర్మ మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మరికొన్ని మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారని, అందువల్ల కౌంటర్లు దాఖలు చేయడానికి మరికొంత గడువివ్వాలని కోరారు. కొన్ని ఇతర అత్యవసర అంశాలున్నాయని, కరోనా వ్యాప్తి, ధరణి వంటి కొత్త వేదిక తీసుకురావడం తదితరాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు వెళ్లలేకపోతోందని, అందువల్ల గత ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ తాము స్టే ఇవ్వలేదని, రిజిస్ట్రేషన్ చేయవద్దని చెప్పలేదని, పాత పద్ధతిలో చేసుకోవచ్చని కూడా సూచించామంది. ఈ దశలో గోపాల్శర్మ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి జోక్యం చేసుకుంటూ గత పద్ధతిలో ఆన్లైన్ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి చేసుకునేవారని, ప్రస్తుతం మొత్తం ఆన్లైన్లోనే అంటున్నారన్నారు. గతంలో పీటీఐఎన్ అడిగేవారు కాదని, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 70, నిబంధనలు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. రిజిస్ట్రేషన్లను వారే గత సెప్టెంబరులో నిలిపివేశారని, పాత పద్ధతిలో ఎలాంటి పరిమితులు లేకుండా చేయబోమని ఆదేశించాలని కోరారు. దీనిపై ఏజీ స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయాలని ప్రభుత్వం ఎన్నడూ ప్రయత్నించలేదని, గతంలో ఉన్న విధానంలోనే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్ సౌకర్యం లేనివారి పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా రిజిస్ట్రేషన్ శాఖ సహకారం అందిస్తుందని.. అయితే స్లాట్ బుకింగ్ తప్పనిసరని ఏజీ తెలిపారు. ధరణి పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయడంలేదని స్పష్టం చేశారు. వాదనలను విన్న ధర్మాసనం ఏజీ హామీని నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 70ఎ, 70బి, 70సిలు, నిబంధనలు 221 నుంచి 237 వరకు పేర్కొన్న విధానంలో రిజిస్ట్రేషన్కు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఇతర మధ్యంతర పిటిషన్లపై ఈనెల 14లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
స్లాట్ బుకింగ్పై నిషేధం లేదు
రిజిస్ట్రేషన్ నిమిత్తం స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్లాట్ బుకింగ్పై చట్టప్రకారం ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఒకేసారి వెయ్యి మంది వస్తే ఇబ్బందులుంటాయని, క్రమపద్ధతిలో ఉంచడానికే స్లాట్ పద్ధతి ఉపయోగపడుతుందని తెలిపింది. ఒకవేళ ఆన్లైన్లో ఇబ్బందులున్నా, కంప్యూటర్ వ్యవస్థ పాడైనా నిబంధనల్లోనే ప్రత్యామ్నాయం ఉందని పేర్కొంది. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్కు రావచ్చని, ఒకవేళ పీటీఐఎన్ నంబరు లేకపోతే రెండు రోజుల్లో కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు పచ్చజెండా
నేటి నుంచి పాత విధానంలోనే స్లాట్ నమోదు
14 నుంచి రిజిస్ట్రేషన్లు
సీఎం ఆదేశంతో ఏర్పాట్లు చేసిన రిజిస్ట్రేషన్ శాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్వపు విధానంలో (కార్డ్) స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ నమోదు ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్లు మాత్రం 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ధరణి పోర్టల్ వేదికగా జరపాలనే తలంపుతో రాష్ట్రంలో సెప్టెంబరు 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగేలా పురపాలక, జీహెచ్ఎంసీ, గ్రామపంచాయతీలకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ధరణిలో ఆధార్ వంటి వివరాల నమోదుపై అభ్యంతరాలు వ్యక్తంకావడం, కోర్టు కేసుల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకాలేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను శుక్రవారం నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు సీఎస్ సోమేశ్కుమార్తో ఈ విషయమై చర్చించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ‘శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీచేశాం. రిజిస్ట్రేషన్లు 14 నుంచి ఆరంభిస్తాం. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు లేదా మార్గదర్శకాలు జారీఅవుతాయి. ఆ ప్రకారం ప్రక్రియను కొనసాగిస్తాం’ అని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
నిర్ణయాలివీ
* 11 నుంచి స్లాట్ నమోదు చేసుకోవచ్చు.
* పూర్తి రుసుం చెల్లించిన వారికే ఈ అవకాశం ఉంటుంది.
* 14 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.
* ఇకపై ముందస్తుగా వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకుంటేనే రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM