సంక్షేమం, వ్యవసాయం కీలకం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు రూపమిచ్చే కసరత్తు మొదలైంది. ప్రతిపాదనలకు ప్రభుత్వ శాఖలు తుదిరూపమిచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శాఖల వారీగా వ్యయం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాటి అవసరాల మేరకు
ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాలకు నిధులు అదనం
బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు రూపమిచ్చే కసరత్తు మొదలైంది. ప్రతిపాదనలకు ప్రభుత్వ శాఖలు తుదిరూపమిచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శాఖల వారీగా వ్యయం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాటి అవసరాల మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వాస్తవ వ్యయ ప్రాతిపదికనే బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ఆయా శాఖలకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 15 రోజుల క్రితం దాని మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించగా.. తర్వాతి స్థానంలో సంక్షేమం, నీటిపారుదలశాఖ నిలిచాయి. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాల నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు నిధులను మరింత పెంచాల్సిన అవసరాన్ని పేర్కొంటూ సంబంధిత శాఖలు అంచనాలు రూపొందించాయి.
* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళితబంధు అమలుకు రానున్న బడ్జెట్లో భారీగా కేటాయింపులు దక్కనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత బడ్జెట్లో దళిత సాధికారతకు రూ.1000 కోట్లను కేటాయించిన ప్రభుత్వం దళితబంధు పథకాన్ని చేపట్టింది. రాష్ట్రస్థాయిలో దాన్ని దశలవారీగా పూర్తిగా అమలుచేస్తామంది. వచ్చే బడ్జెట్లో పథకం అమలుకు రూ.20వేల కోట్లను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంక్షేమ కేటాయింపుల్లో దానికి పెద్దపీట వేస్తారని సమాచారం.
* వ్యవసాయానికి ఈ ఏడాది అత్యధికంగా రూ.25వేల కోట్లను కేటాయించగా వచ్చే బడ్జెట్లో రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా అమలు నేపథ్యంలో అంతకంటే పెంపును ప్రతిపాదిస్తూ వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేసింది.
* ఆసరాకు గతం కంటే నిధులు కేటాయింపు పెరగనుంది. పింఛను అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
సొంత రాబడులపై కొండంత ధీమా
సొంత రాబడులపై పూర్తి విశ్వాసంతో పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్లపై పూర్తి ధీమాతో రూ.2.76 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆర్థిక సంవత్సరంలో మరో రెండున్నర నెలలే మిగిలివున్న నేపథ్యంలో సొంత పన్నుల రాబడి పూర్తి ఆశాజనకంగా ఉన్నా గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నేతర ఆదాయం మాత్రం బాగా తగ్గింది. జీఎస్టీ, అమ్మకం పన్ను, ఎక్సైజ్ రాబడి, స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ ఆదాయం, రవాణా సహా ఇతర పన్నులు, డ్యూటీల రూపేణా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 నుంచి 20 శాతం దాకా వృద్ధిని ఆయా శాఖలు అంచనా వేస్తున్నాయి. పన్నేతర రాబడిలో భాగంగా భూముల విక్రయం ద్వారా సుమారు సుమారు రూ.20వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేయగా.. ఇప్పటి వరకు సుమారు రూ.5000 కోట్లు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండున్నర నెలలు మిగిలి ఉండటంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల స్థిరాస్తి అభివృద్ధి నేపథ్యంలో భూముల వేలం ద్వారా నిధులను సమకూర్చుకోవటంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM