- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
తెలంగాణ బిడ్డల కోసమే స్థానిక రిజర్వేషన్లు
మూడేళ్లలో కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు: మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, న్యూస్టుడే: తెలంగాణ బిడ్డలకు ఎక్కువ ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిల్లో స్థానిక రిజర్వేషన్లు పెంచారని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దీని వల్ల 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని, ఇంతకుముందు 40 శాతం మేర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అభ్యర్థులు పొందేవారని పేర్కొన్నారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆదివారం స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని అన్నారు. ‘‘అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నెల, రెండు నెలలకు ఓ ఉద్యోగ ప్రకటన జారీ చేస్తున్నాం. గ్రూప్-1 తరవాత గ్రూప్-2, 3 నోటిఫికేషన్లు రానున్నాయి. పోలీసు ఉద్యోగ నియామకాలు పూర్తవగానే గ్రూప్-4 ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరానికి ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దేశంలో సుమారు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భాజపా సర్కారు మూడేళ్లలో ఒక్కటీ భర్తీ చేయలేదు. వాటి భర్తీకి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఆ నియామకాలను చేపడితే కేంద్రం పరిధిలోని మరో లక్ష ఉద్యోగాలు తెలంగాణ విద్యార్థులకు వచ్చే అవకాశముంటుంది’’ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
-
World News
Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్కే ఎక్కువ అవకాశాలు..!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Social Look: పారిస్ ప్రేమలో మెహరీన్.. ట్రెండ్ ఫాలో అయిన ప్రియా ప్రకాశ్!
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!
- Brahmaji: అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాం: బ్రహ్మాజీ