ఇంటర్‌ సప్లిమెంటరీ కాలపట్టిక విడుదల

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కాలపట్టికను ఇంటర్‌బోర్డు బుధవారం విడుదల చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ, మధ్యాహ్నం 2.30 గంటల

Published : 30 Jun 2022 03:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కాలపట్టికను ఇంటర్‌బోర్డు బుధవారం విడుదల చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌బోర్డు తెలిపింది. గతంలో రాయని వారికి జులై 22న నైతికత, మానవీయ విలువలు, 23న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని