జడ్పీ అధ్యక్షులు, ఎంపీపీలకు చెక్‌ పవర్‌

తెలంగాణలోని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులకు చెక్‌ పవర్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి విజ్ఞప్తిమేరకు సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం

Published : 01 Jul 2022 06:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులకు చెక్‌ పవర్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి విజ్ఞప్తిమేరకు సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని వెంటనే అమలు చేయనున్నట్లు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి తమ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హన్మంతరావులతో సమావేశమై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. ఉత్తర్వుల జారీ తర్వాత...  15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి జడ్పీ అధ్యక్షులకు, ఎంపీపీలకు చెక్‌పవర్‌ ఉపయోగపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని