కృష్ణా నదిపై తొమ్మిది సెన్సర్లు
కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో ప్రవాహాల నమోదుకు అత్యాధునిక సెన్సర్లు ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది.
పక్కాగా ప్రవాహాల నమోదుకు బోర్డు కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో ప్రవాహాల నమోదుకు అత్యాధునిక సెన్సర్లు ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది. జల వినియోగాన్ని పక్కాగా లెక్కించేందుకు ఇప్పటి వరకు టెలీమెట్రీ పరికరాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నూతన సాంకేతికత ఉన్న సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్ (ఎస్ఎల్డీసీపీ) పరికరాలను వినియోగించాలని నిర్ణయించారు. వాటి కొనుగోళ్లకు మార్గదర్శకాలు ఖరారు కాగా బోర్డు తుదిదశ పరిశీలనలో ఉన్నాయి. రెండేళ్ల క్రితమే ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తొమ్మిది చోట్ల పరికరాలను ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చింది.
త్వరలోనే టెండర్లు..
కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి తరచూ ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నాయి. వినియోగాన్ని లెక్కించేందుకు మాత్రం బోర్డు వద్ద పూర్తి స్థాయిలో వనరులు లేవు. గతంలో రెండు రాష్ట్రాల్లో కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే 18 చోట్ల టెలీమెట్రీ పరికరాలు ఏర్పాటు చేశారు. అవి నీటి మట్టం అంచనా వేసి ఆ సమాచారాన్ని (డేటా) హైదరాబాద్లోని కంట్రోల్ రూంకు పంపుతున్నాయి. అయితే టెలీమెట్రీలు ఉన్న పలు ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో రోజూ నిర్దిష్ట సమయంలో రీడింగ్ నమోదు కావడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో నీటి మట్టం, లోతు, ప్రవాహ వేగం కూడా లెక్కించే అధునాతన ఎస్ఎల్డీసీపీల ఏర్పాటుకు బోర్డు మొగ్గుచూపుతోంది. దీనికోసం సుమారు రూ.4.30 కోట్లతో టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పాత పరికరాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా సిద్ధం చేశాక కొత్తవి ఏర్పాటు చేయాలని పలువురు బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో టెండర్ల ప్రక్రియ కొంత నెమ్మదించినట్లు తెలిసింది.
ఏర్పాటు చేయనున్న ప్రాంతాలు...
అధునాతన పరికరాలను కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాలువపై అలాగే ఎడమ కాలువ పరిధిలో పాలేరు, తిరువూరు ప్రాంతాల్లో, విజయవాడ ప్రకాశం బ్యారేజీ తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు, పోలవరం కాలువలపై ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
పాత పరికరాల పరిశీలన
కృష్ణా పరీవాహకంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న 18 టెలీమెట్రీ పరికరాల పనితీరుపై కృష్ణా బోర్డు ఇంజినీర్లు పరిశీలన చేపట్టారు. జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విడతల వారీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!