2జీ కూడాలేని 390 గ్రామాలకు నేరుగా 4జీ
రాష్ట్రంలో నెట్వర్క్ విస్తరణ దిశగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) అడుగులేస్తోంది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నెట్వర్క్ విస్తరణ దిశగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) అడుగులేస్తోంది. ఇంతకాలం 3జీ కాదు కదా కనీసం 2జీ కూడా లేని గ్రామాలకు ఇప్పుడు నేరుగా 4జీ నెట్వర్క్ రాబోతుంది. తెలంగాణలో ఆ గ్రామాలు 390 ఉన్నట్లు బీఎస్ఎన్ఎల్ గుర్తించింది. ఒక్కో గ్రామంలో నెట్వర్క్ వసతుల కల్పనకు రూ.18 లక్షలు ఖర్చు చేయబోతుంది. బీఎస్ఎన్ఎల్ రివైవల్ 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 26 వేల గ్రామాల్లో నేరుగా 4జీని ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ ఇప్పటివరకు నెట్వర్క్ లేని గ్రామాలను ఉమ్మడి జిల్లాల వారీగా గుర్తించింది. వీటిలో 60 శాతం గ్రామాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో ఇప్పటికే 277 మొబైల్ టవర్లుండగా కొత్తగా 158 ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత ఉమ్మడి వరంగల్లో ఎక్కువ గ్రామాలున్నాయి. ఇక్కడ 312 టవర్లు ఉండగా కొత్తగా 46 వేస్తారు. ఉమ్మడి ఖమ్మంలో 246 టవర్లుండగా 40 కొత్తవి వేస్తారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరణకు బీఎస్ఎన్ఎల్ కేబుల్, ఎక్విప్మెంట్తో కలిపి రూ.100 కోట్ల వరకు వ్యయం చేయబోతున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ సీజీఎం కె.వి.ఎన్.రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా