లోపాలపై స్పందించరా?
విజిలెన్స్ నివేదికతో నీటిపారుదల శాఖ మేల్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చింది.
కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి
ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు
విజిలెన్స్ నివేదికతో ఎట్టకేలకు కదలిక
ఈనాడు - హైదరాబాద్
విజిలెన్స్ నివేదికతో నీటిపారుదల శాఖ మేల్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణం పూర్తయి మూడేళ్లపాటు నిర్వహించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగినా, ప్రారంభించిన కొద్దికాలానికే బ్యారేజీల్లో సీపేజీ సమస్య ఏర్పడినా ఇన్నాళ్లూ చర్యలకు ఉపక్రమించని నీటిపారుదల శాఖలో.. విజిలెన్స్ నివేదికతో కదలిక వచ్చింది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం)కు ప్రత్యేక విభాగం ఉంది. నాణ్యత తనిఖీలకు ప్రత్యేక విభాగాలున్నాయి. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ ఉంది. నిర్వహణలోని లోపాలపై దిగువస్థాయి ఇంజినీర్లు ఎప్పటికప్పుడు అటు గుత్తేదారులు, ఇటు ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్ల దృష్టికి తెస్తూనే ఉన్నా చూసీచూడనట్లుగా వ్యవహరించారు. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెల్లడైన లోపాల ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్(రామగుండం)కు ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) నోటీసు ఇవ్వగా, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు చీఫ్ ఇంజినీర్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి కూడా దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం, డ్యాం సేఫ్టీ అధికారులు ఏటా వర్షాకాలం ముందు, తర్వాత బ్యారేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ సమస్యలున్నాయో, ఏం చర్యలు తీసుకోవాలో రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉండగా.. ఇందులో లోపం జరిగిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్.డి.ఎస్.ఎ.), విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ లేవనెత్తిన అంశాల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. వాటిలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
2019లోనే సమస్యను గుర్తించినా నిర్లక్ష్యం..
మేడగడ్డ బ్యారేజీపై ఫిబ్రవరి 13న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ సమయంలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సహా పలు వైఫల్యాలను ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. ఐ.ఎస్. కోడ్లోని నిబంధనల ప్రకారం ఏటా వర్షాకాలం తర్వాత ఆఫ్రాన్ ప్రాంతాన్ని పరిశీలించి ఎలా ఉందో అంచనా వేయాలి. బ్యారేజీ దిగువ ప్రాంతంలో నాన్ లాంచింగ్ ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా పరీక్షించాలి. నీటిపారుదల శాఖ అధికారులు ఈ పని చేయలేదు. దీంతోపాటు బ్యారేజీ ప్రారంభమైన తర్వాత సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆఫ్రాన్లను తనిఖీ లేదా మెయింటెనెన్స్ చేయలేదు. 2019-20లోనే నిర్వహణ సమస్యలు తలెత్తి సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోయాయి. 2019 నవంబరులోనే గుర్తించిన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల తదుపరి సమస్యలు తలెత్తాయి. బ్యారేజీ రక్షణ.. పటిష్ఠ నిర్మాణం, నాణ్యతపై ఆధారపడి ఉంటుందని ఐ.ఎస్. కోడ్ 12891 చెబుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేవనెత్తిన అంశాల నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణ చర్యలు చేపట్టేందుకు, వెంటనే నిర్వహణలోకి తేవడానికి తదుపరి కార్యాచరణ ఏమిటో చీఫ్ ఇంజినీర్(రామగుండం) తెలపాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ సూచించారు. సమస్య తీవ్రత దృష్ట్యా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పనులు యుద్ధప్రాతిపదికన ఏమేం చేయాలో తెలపాలని, మే నెలాఖరు నుంచే ప్రాణహిత నదికి ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉన్నందువల్ల తదుపరి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఒప్పందం ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టనందుకు సంబంధిత ఎస్.ఇ.లకు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు, గుత్తేదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని చీఫ్ ఇంజినీర్కు నిర్దేశించారు. 2020 నుంచి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ జరగలేదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొన్నందువల్ల దీనికి గుత్తేదారులు/నీటిపారుదల శాఖ కారణమన్నారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఓ అండ్ ఎం కార్యకలాపాలు జరగకపోయినా, నిర్ణీత వ్యవధిలోగా చర్యలు తీసుకొని బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోకపోయినా చీఫ్ ఇంజినీర్(రామగుండం) బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.