సివిల్స్‌ ర్యాంకర్‌ అక్షయ్‌ను అభినందించిన సీఎం

సివిల్స్‌-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్‌ దీపక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.

Published : 23 Apr 2024 04:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్స్‌-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్‌ దీపక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని సోమవారం అక్షయ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్షయ్‌కు సీఎం శాలువా కప్పి సత్కరించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌, అక్షయ్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు