CM KCR: ముందస్తుకు వెళ్లంగాక వెళ్లం
‘ఆరునూరైనా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు. ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తాం. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే
ప్రశాంత్ కిశోర్ నాకు స్నేహితుడు
ఓట్ల కోసమే ‘కశ్మీర్ ఫైల్స్’
ఈడీ దాడులకు భయపడేది లేదు
సీఎం కేసీఆర్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ‘ఆరునూరైనా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు. ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తాం. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెరాస గెలుస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. 0.3 శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్లు తేలింది. అంటే 119 స్థానాలకు గాను 4 స్థానాలే కోల్పోతామని తెలుస్తోంది. తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు, ఈసారి కచ్చితంగా 95-105 సీట్ల మధ్య గెలుస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పరిస్థితిపై మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తాం. బజార్లో అరిచే వ్యక్తుల గురించి మాట్లాడను.
డబ్బుల కోసం పీకే పనిచేయరు
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాతో కలిసి పని చేస్తున్నారు.. అది రహస్యం కాదు. ఎనిమిదేళ్లుగా ఆయన నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడూ డబ్బులు తీసుకుని పనులు చేయరు. దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత నాకు తెలుసు. పార్టీల అవసరాల మేరకు 12 రాష్ట్రాల్లో పనిచేశారు. భాజపాతో కూడా కొంతకాలం ఉన్నారు. దేశ రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నందున నా ఆహ్వానం మేరకు వచ్చి పనిచేస్తున్నారు. దేశం, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆయన సర్వే చేస్తున్నారు.
మరో 10,000 ఉపాధ్యాయ పోస్టులు..
కచ్చితంగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం. హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలలు మూసేస్తారని అపోహలు సృష్టిస్తున్నారు. అదంతా తప్పు. ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ప్రతి పాఠశాలలో ఆంగ్లం సహా అన్ని సబ్జెక్టులకు. ఉపాధ్యాయులుండాలి. మరో 10 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చి, నియామకాలు చేపడతాం. ఇవికాక తొమ్మిదో, పదో షెడ్యూల్డు సంస్థలలోనూ మరో 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు వస్తాయి.
భాజపా లబ్ధి కోసమే ఫైల్స్
భాజపా ‘కశ్మీర్ ఫైల్స్’తో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. సమాజానికి చేటుచేసే ఇలాంటి సినిమాలను ఆహ్వానించకూడదు. దేశంలో.. నీటిపారుదల, ఆర్థిక, పారిశ్రామికీకరణ పురోభివృద్ధి మీద సినిమాలు రావాలి కానీ ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. దిక్కుమాలిన వ్యవహారం. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె అన్నాం కానీ.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కుల సమ్మె అనలేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులిచ్చి మరీ కశ్మీర్ ఫైల్స్ చూడమంటున్నారు. విద్వేష, విభజన రాజకీయాలతో జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దిల్లీలోని కశ్మీరీ పండిట్లకు న్యాయం చేయాలి. తెలంగాణలోని బోధన్లో శివాజీ విగ్రహం పేరిట భాజపా రాజకీయం చేస్తోంది.
భయపడితే ఉద్యమం చేయగలమా!
ఈడీ, ఐటీ పన్ను దాడులు చేస్తారని యూట్యూబ్లో ప్రచారం చేస్తున్నారు. ఈడీ కాకపోతే బోడీ దాడులు చేయమను. కేసీఆర్ ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడతాడా? ఇలా భయపడితే 15 ఏండ్లు తెలంగాణ ఉద్యమం చేద్దుమా? భయంకరంగా కుంభకోణాలు చేసేవాళ్లకు భయం ఉంటుంది. ఈ పిట్ట బెదిరింపులు నా వద్ద పనిచేయవు.
చినజీయర్తో విభేదాల్లేవు
చినజీయర్స్వామితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. దూరం పెరిగిందని ఎవరన్నారు? ఇలాంటి అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’ అని కేసీఆర్ అన్నారు.
జాతీయ రాజకీయాల్లో శూన్యత..
కేసీఆర్ అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పనిచేస్తాను. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉంది. దేశంలో కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది. భాజపా నాయకులు బుల్డోజర్లు తెస్తున్నామంటున్నారు. వారు ఇక్కడ కూలీ పనులు చేసుకుంటారు. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ లో పాదయాత్ర చేస్తామంటే స్వాగతిస్తాం. ఇప్పటికే చాలామంది పాదయాత్ర చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి