బస్సు బడి!
‘రైలు బడి’ పుస్తకం చదివారా? ప్రముఖ జపాన్ రచయిత్రి టెట్సుకోకురియనాగి రాసిన ఈ పుస్తకం... పాత రైలుపెట్టె బడిగా మారిన వైనం, ఆ బడిని ఇష్టపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడీ సంగతి ఎందుకంటారా? అక్కడ రైలు బడి ఉన్నట్టే ఇక్కడ ‘ఎల్లో బస్సు’ల్లోనూ అచ్చంగా అలాంటి ఆసక్తికరమైన బోధనే జరుగుతుంది కాబట్టి. ఎక్కడ... ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? బస్సులోనో, కారులోనో ప్రయాణించేటప్పుడు సిగ్నల్స్ దగ్గర పిల్లలు ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే ఏమంటాం?
‘రైలు బడి’ పుస్తకం చదివారా? ప్రముఖ జపాన్ రచయిత్రి టెట్సుకోకురియనాగి రాసిన ఈ పుస్తకం... పాత రైలుపెట్టె బడిగా మారిన వైనం, ఆ బడిని ఇష్టపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడీ సంగతి ఎందుకంటారా? అక్కడ రైలు బడి ఉన్నట్టే ఇక్కడ ‘ఎల్లో బస్సు’ల్లోనూ అచ్చంగా అలాంటి ఆసక్తికరమైన బోధనే జరుగుతుంది కాబట్టి. ఎక్కడ... ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? బస్సులోనో, కారులోనో ప్రయాణించేటప్పుడు సిగ్నల్స్ దగ్గర పిల్లలు ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే ఏమంటాం? ‘ఈ వయసులో చక్కగా చదువుకోవచ్చుగా.. అలా డబ్బులు అడక్కూడదు’ అని మందలిస్తాం కదా! అలా మనం అన్నంత మాత్రాన వాళ్లు వెళ్లి చదువుకుంటారా? కష్టమే! కానీ ఆ బాధ్యతని స్వయంగా తీసుకుని మురికివాడల పిల్లలని చదువులబాట పట్టిస్తున్నాయి అహ్మదాబాద్లోని ‘సిగ్నల్ స్కూల్స్’. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలు కలిసి 2022లో ఆ ఆలోచనకి శ్రీకారం చుట్టాయి. ఈ బస్సులు... మురికివాడల్లో చదువుకోకుండా తిరిగే పేదపిల్లల్నీ, చిన్నవయసులో చదువుమానేసిన వాళ్లని గుర్తించి చదువు బోధిస్తాయి.
ఉదయం ఈ బస్సుల్లోనే విద్యా, బుద్ధులు నేర్పి... తిరిగి వాళ్లని ఇళ్ల దగ్గర అప్పగిస్తాయి. ఈ బస్సుల్లో ఎల్సీడీ టీవీలు, వైఫై కనెక్షన్, ఎడ్యుకేషనల్ టాయ్స్ వంటి ఆధునిక సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ చదువుమీద ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలకు... పదినెలలపాటు విద్యా బోధన చేస్తారు. తర్వాత దగ్గర్లోని ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తారు. బ్యాచ్లో టాపర్గా నిలిచిన పిల్లలను కేంబ్రిడ్జ్ స్కూల్లో చేరుస్తారు. ‘ఈ పిల్లలకు చదువుచెప్పే క్రమంలో మొదటి ఆటంకం వాళ్ల తల్లిదండ్రుల నుంచే ఎదురవుతుంది. దాంతో వాళ్లకీ కౌన్సెలింగ్ చేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఈ బోధనా బాధ్యతలు చూస్తున్న అహ్మదాబాద్ మున్సిపల్ స్కూల్ బోర్డ్ అధికారిణి డా. లాగ్దిన్ దేశాయ్. ఇప్పటివరకూ 3 బ్యాచులు నిర్వహిస్తే 413 మంది పిల్లలను చదువుల బాట పట్టించారు. ఈ సిగ్నల్ స్కూళ్ల కోసం ప్రభుత్వం రూ. 3 కోట్ల రూపాయల్ని వెచ్చించింది. త్వరలో మరికొన్ని నగరాల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని గుజరాత్ ప్రభుత్వం యోచిస్తోందట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- మీరైతే ఏం చేస్తారు?
- కొలీగ్తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!