US Embassy: ఉక్రెయిన్ను వీడండి.. అమెరికన్లకు విదేశాంగ శాఖ హెచ్చరిక!
ఉక్రెయిన్(Ukraine) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాబోయే రోజుల్లో.. ఆ దేశంపై రష్యా(Russia) సేనలు మరిన్ని దాడులతో విరుచుకుపడే ప్రమాదం ఉందని అమెరికా(America) హెచ్చరించింది....
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్(Ukraine) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాబోయే రోజుల్లో.. ఆ దేశంపై రష్యా(Russia) సేనలు మరిన్ని దాడులతో విరుచుకుపడే ప్రమాదం ఉందని అమెరికా(America) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని అమెరికన్లు వీలైతే దేశం విడిచిపెట్టాలని కీవ్(Kyiv)లోని అగ్రరాజ్య రాయబార కార్యాలయం(US Embassy) కొత్తగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ‘రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పౌర సదుపాయాలు, ప్రభుత్వ కేంద్రాలపై రష్యా తన దాడులను ముమ్మరం చేయనుందని విదేశాంగ శాఖకు సమాచారం ఉంది’ అని అమెరికా ఎంబసీ తన వెబ్సైట్లో పేర్కొంది.
సురక్షితమని భావిస్తే ప్రైవేటుగా అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా ఉక్రెయిన్ నుంచి బయలుదేరాలని కోరింది. రష్యా సైనిక చర్య ప్రారంభానికి ముందు సైతం అగ్రరాజ్యం.. ఉక్రెయిన్లోని తన పౌరులకు పలుమార్లు ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్ కూడా రాకెట్ దాడులకు అవకాశం ఉన్నందున గురువారం వరకు రాజధాని ‘కీవ్’లో స్వాతంత్య్ర దినోత్సవాలకు సంబంధించి భారీ బహిరంగ కార్యక్రమాలు, ర్యాలీలు, ఇతర సమావేశాలను నిషేధించింది.
పదింట ఒక పాఠశాల ధ్వంసం: యూనిసెఫ్
మరోవైపు.. ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిన్నారుల మరణాలపై యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు సగటున అయిదుకుపైగా.. ఇప్పటివరకు 972కుపైగా చిన్నారులు మృతి చెందారు లేదా గాయపడ్డారని తెలిపారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందన్నారు. ఈ వారంలో ఉక్రెయిన్లో విద్యాసంవత్సరం మొదలు కానుంది. అయితే, యూనిసెఫ్ అంచనా ప్రకారం.. స్థానికంగా 10 పాఠశాలల్లో ఒకటి ధ్వంసమైందని ఆమె చెప్పారు. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం ఇరు దేశాలు కాల్పుల విరమణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్