Thailand: థాయిలాండ్లో ప్రీస్కూల్ వద్ద కాల్పులు: కనీసం 32 మంది మృతి
థాయిలాండ్లోని ఓ ప్రీస్కూల్ వద్ద ఘోరం చోటు చేసుకొంది. ఓ దుండగుడు ప్రీస్కూల్ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 32 మంది మరణించినట్లు స్థానిక వార్తాపత్రికలు పేర్కొంటున్నారు. మృతుల్లో అత్యధిక మంది చిన్నపిల్లలే.
ఇంటర్నెట్డెస్క్: థాయిలాండ్లోని ఓ ప్రీస్కూల్ వద్ద ఘోరం చోటు చేసుకొంది. ఓ దుండగుడు ప్రీస్కూల్ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 32 మంది మరణించినట్లు స్థానిక వార్తాపత్రికలు పేర్కొంటున్నాయి. మృతుల్లో అత్యధిక మంది చిన్నపిల్లలే. ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్బు నాలంఫూ ప్రావిన్స్లో చోటు చేసుకొంది. కాల్పులకు పాల్పడిన దుండగుడు తప్పించుకోవడంతో పోలీసులు అతడి కోసం వేట మొదలుపెట్టారు.
నిందితుడిని 34 ఏళ్ల పాన్య ఖమ్రాప్గా అనుమానిస్తున్నారు. అతడు మాజీ పోలీసు అధికారి. అతడిని ఏడాది కిందటే విధుల నుంచి తొలగించారు. అప్పట్లో అతడు మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. వాస్తవానికి అతడు శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కాల్పులకు పాల్పడిన అనంతరం అతడు బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న 4డోర్ వీగో పికప్ ట్రక్ ఎక్కి పారిపోయాడు.
సాధారణంగా థాయిలాండ్లో భారీ కాల్పుల ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకొంటాయి. చివరి సారిగా 2020లో నఖోమా రాట్చెస్మా నగరంలో ఓ సైనికుడు 21 మందిని కాల్చి చంపడంతోపాటు.. అనేక మంది పౌరులను గాయపర్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..