Australia: ఇక ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం.. సగానికి తగ్గనున్న విద్యార్థి వీసాలు!
కుప్పకూలిన వలస వ్యవస్థను కొత్త విధానం (Migration Policy) ద్వారా తిరిగి గాడిలో పెట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యార్థి, కార్మికుల వీసాలను సగానికి తగ్గించాలని యోచిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తుల వీసా నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు ఆస్ట్రేలియా (Australia visa) వెల్లడించింది. తద్వారా వచ్చే రెండేళ్లలో వీరి వలసలను సగానికి తగ్గించవచ్చని అంచనా వేస్తోంది. కుప్పకూలిన వలస వ్యవస్థను కొత్త విధానం (Migration Policy) ద్వారా తిరిగి గాడిలో పెట్టవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆశిస్తోంది.
ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం.. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వలసల సంఖ్య రికార్డు స్థాయిలో 5,10,000గా నమోదైంది. ఒకే ఏడాది ఈ సంఖ్యలో రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థులే ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఖ్యను సగానికి తగ్గించే లక్ష్యంతో తాజా సంస్కరణలకు సిద్ధమైంది. తద్వారా 2024-25, 2025-26 నాటికి వలసల సంఖ్య 2.5లక్షలకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది. ఇది కొవిడ్కు ముందున్న స్థాయికి సమానం. ఇక కొత్త వీసా నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు ఇంగ్లిష్ నైపుణ్య పరీక్షల్లో అధిక రేటింగ్ పొందాల్సి ఉంటుంది. దీంతోపాటు వసతికి సంబంధించి విద్యార్థి దరఖాస్తును ఆస్ట్రేలియా మరింత నిశితంగా పరిశీలించనుంది.
హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!
కొత్త విధానంలో అనుసరిస్తోన్న వ్యూహంతో వలసల సంఖ్య సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా హోంశాఖ మంత్రి క్లేర్ ఓనీల్ పేర్కొన్నారు. నూతన వలస విధానంపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఇది ఆస్ట్రేలియా భవిష్యత్తుకు సంబంధించిన విషయమన్నారు. తాజా నిర్ణయం విదేశీ వలసలపై ఒత్తిడి పెంచుతుందని.. తద్వారా వలసదారుల సంఖ్య తగ్గుదలకు దోహదపడుతుందన్నారు. మరోవైపు దేశంలో వలస విధానంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ఇటీవల మాట్లాడుతూ.. దేశంలో వలసలు ఆందోళన స్థాయికి చేరుకున్నాయని, వీటి సంఖ్య స్థిరమైన స్థాయికి తీసుకురావాల్సిన అవసరముందన్నారు.
ఇదిలాఉంటే, కొవిడ్ సమయంలో ఏర్పడిన కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల భారీ స్థాయిలో వలసలను ప్రోత్సహించింది. దీంతో విదేశీ విద్యార్థులు, నిపుణులు ఆస్ట్రేలియా వైపు దృష్టి సారించారు. అప్పటికే గృహ సంక్షోభం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాపై ఈ పరిణామం మరింత ఒత్తిడి పెంచింది. ఆస్ట్రేలియా గణాంక విభాగం ప్రకారం దేశవ్యాప్తంగా ఇటీవల ఇంటి అద్దెలు 7.6శాతం పెరిగాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇలా గృహ సంక్షోభం వేళ భారీ స్థాయిలో వలసలు రావడం స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి, నిపుణుల వలసలను సగానికి తగ్గించి.. కేవలం అత్యంత నైపుణ్యం కలిగిన వారికే శాశ్వత నివాసం కల్పిస్తూ దేశంలోకి అనుమతించేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నాలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!